రాజ్యాంగ బద్దంగానే రాజ్ భవన్... అంతా చట్టపరిధికి లోబడే

రాజ్యాంగ బద్దంగానే రాజ్ భవన్...
అంతా చట్టపరిధికి లోబడే


రమేష్ కుమార్ ను తొలిగించలేదు... కేవలం స్యయంచాలిత పదవీ విరమణ మాత్రమే


            రాష్ట్ర ఎన్నికల కమీషన్ వ్యవహారాలలో తాజాగా చోటు చేసుకున్న మార్పులు రాజ్యాంగ బద్దమైనవేనా, రాష్ట్ర రాజ్యాంగ సంరక్షణ కార్యాలయంగా ఉన్న రాజ్ భవన్ ఆ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించిందా, చట్టం ఏమి చెబుతోంది, జరిగిందేమిటి? ఇది రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశమైంది. ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరిలోనూ పలు సందేహాలు నెలకొన్నాయి.  ఈ అంశమే గత 3 రోజులుగా హాట్ టాపిక్ గా మారింది.


            రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పదవీకాలాన్ని 5 నుండి 3 సంవత్సరాలకు తగ్గించడం ద్వారా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 (కె), ఎపి పంచాయతీ రాజ్ చట్టంలోని సెక్షన్ 200 లను ఉల్లంఘించారని కొందరి అభిప్రాయం. కాని వాస్తవం అది కాదు. ఇక్కడ అంతా రాజ్యాంగ పరిధికి లోబడే ప్రక్రియ కొనసాగింది. ప్రస్తుత ఎస్‌ఇసి ఎన్ రమేష్ కుమార్ పదవీ కాలం ముగియటం, ప్రభుత్వం కొత్త ఎస్‌ఇసిని నియమించటం,  రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 (కె), ఎపి పంచాయతీ రాజ్ చట్టం, 1994 లోని 200 సెక్షన్ ప్రకారమే జరిగింది.


            భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 (కె),  AP పంచాయతీ రాజ్ చట్టం లోని సెక్షన్ 200  ఏమి చెబుతున్నాయన్నది ఒక సారి పరిశీలిద్దాం. ఆర్టికల్ 243 కె (2) ప్రకారం ప్రకారం “రాష్ట్ర శాసనసభ ద్వారా రూపుదిద్దుకున్న ఏదైనా చట్టం యొక్క నిబంధనలకు లోబడి ఎస్‌ఇసి యొక్క పదవీకాలం, సర్వీసు నిబంధనలను గవర్నర్ నిర్ణయిస్తారు. ఎస్ఇసి ను హైకోర్టు న్యాయమూర్తిగా స్దాయిలో పరిగణించవలసి ఉంటుంది. ఇతర కారణాల వల్ల తప్ప ఆయనను విధుల నుండి తొలగించలేరు. ఎస్ఇసి సర్వీసు నిబంధనలు అతని నియామకం తరువాత ఎదురయ్యే ప్రతికూలతకు భిన్నంగా ఉండవు. ఇక రెండవది ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ చట్టం 1994 లోని సెక్షన్ 200 (3) నిబంధన, దీనిని అనుసరించి  “స్థానిక సంస్థల కోసం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ యొక్క సర్వీసు నిబంధనలు, పదవీకాలం గవర్నర్ ఆదేశాలకు లోబడి ఉండాలి. స్థానిక సంస్థల ఎన్నికల కోసం నిర్ధేశించిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ యొక్క సర్వీసు నిబంధనలు హైకోర్టు న్యాయమూర్తి మాదిరిగానే ఉంటాయి. తన నియామకం తరువాత అతని ప్రతికూలత అధారంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ తన కార్యాలయం నుండి తొలగించబడరు. ఇవి రాజ్యాంగం, చట్టం చెబుతున్న అంశాలు.


            ఇక మొదటి సందేహం విషయానికి వస్తే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 (కె), ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం లోని సెక్షన్ 200 స్పష్ట పరిచిన దానిని అనుసరించి  సర్వీసు నిబంధనలు, పదవీకాలం అనేవి రెండు భిన్నమైన అంశాలు. ఆ పదాలను గురించి స్పష్టంగా, ప్రత్యేకంగా, విడివిడిగా పేర్కొన్నాయి.  అందువల్ల ఈ రెండు విషయాలను భిన్నంగా చూడాలి. సర్వీసు నిబంధనలు, పదవీ కాలం లను ఒకే గాటన కట్టటం సరికాదు. సర్వీసు నిబంధనలలో అంతర్ భాగంగా పదవీకాలం తీసుకోకూడదు. అయితే సర్వీసు నిబంధనలు, పదవీ కాలం నిర్ణయంలో గవర్నర్ దే అంతిమ అధికారం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 కె,  రాష్ట్ర పంచాయితీ రాజ్ చట్టం 1994 లోని 200 సెక్షన్, ఈ రెండింటిలోనూ స్పష్టంగా పేర్కొన్న దాని ప్రకారం కమీషనర్ నియామకం తరువాత అతని యొక్క ప్రతికూలత అధారంగా సర్వీసు నిబంధనలు మారవని చెప్పిందే తప్ప, పదవీ కాలం విషయంలో అలా ప్రకటించ లేదు. ఈ క్రమంలో గవర్నర్ కు కాని, ప్రభుత్వానికి కాని  రాష్ట్ర ఎన్నికల కమీషనర్ కు సంబంధించిన పదవీకాలం వ్యవహారంలో మార్పులు చేసే సంపూర్తి అధికారాన్ని భారత రాజ్యాంగం కల్పించింది. 


            2007లో ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకున్న పరిణామాలు, తదనంతరం జరిగిన న్యాయ సమీక్ష ఇదే విషయాన్ని ఉటంకిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఆ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పదవీకాలానికి సంబంధించి మార్పులు చేసింది. ఈ మార్పులు చెల్లవంటూ న్యాయస్ధానాన్ని ఆశ్రయించగా అక్కడి  హైకోర్టు స్పష్టమైన తీర్పును ఇచ్చింది. 2007 ఆగస్టు 23న డబ్యుపి 3457 (ఎంబి) 2007 కేసులో గౌరవ అలహాబాద్ (లక్నో బ్రాంచ్) హైకోర్టు శాసనసభ ఆమోదించిన చట్టం ద్వారా పదవీకాలం తగ్గింపుకు సంబంధించి దాఖలు అయిన కేసులో స్పష్టత నిచ్చింది. “రాజ్యాంగంలోని నిర్దిష్ట నిబంధనలను పరిశీలించినప్పుడు ఎస్ఇసి పదవీకాలం అనేది సర్వీసు నిబంధలకు లోబడిన షరతు కాదని తీర్పు నిచ్చింది. భారత రాజ్యాంగంలోని అర్టికల్ 243కె కేవలం సర్వీసు నిబంధనలను మాత్రమే వర్తిస్తుందని, పదవీ కాలానికి సంబంధించిన మార్పు విషయంలో కాదని అలహాబాద్ అత్యున్నత న్యాయ స్దానం స్పష్టం చేసింది. ఎన్నికల కమీషనర్ నియామకం తరువాత  దీనిని సర్వీసు నిబంధనలకు సంబంధించిన  షరతుగా, కాకుంటే దాని ప్రత్యామ్నాయంగా తీసుకోవలసి ఉంటుంది. ఈ క్రమంలో రాజ్యాంగం కాని,  శాసనం కాని సర్వీసు నిబంధనలలో జరిగే మార్పును మాత్రమే అడ్డుకుంటుందే తప్ప, పదవీకాలంలో మార్పును కాదు. కాబట్టి ఎస్ఇసి పదవీకాలాన్ని ఆయన ప్రతికూలత అధారంగా మార్చరాదన్న వాదన ఇటు చట్ట పరిధిలోనూ, అటు రాజ్యాంగ బద్దంగానూ అంగీకారం కాదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న ఈ పరిస్ధితి జాతీయ స్దాయిలో ఎంత మాత్రం కొత్తది కూడా కాదు,  ఇప్పటికే పలు రాష్ట్రాల ఉన్నత న్యాయ స్ధానాలలో ఈ తరహా అంశాలు న్యాయ సమీక్షలను ఎదుర్కున్నాయి.


ఇక రెండవ అంశం  ఎస్‌ఇసి తొలగింపుకు సంబంధించినది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243కె, ఎపి పంచాయతీ రాజ్ చట్టం  సెక్షన్ 200 ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ను సాధారణ పరిస్ధితులలో తొలిగించకూడదు. ఒక వేళ తొలిగించవలవలసి వస్తే హైకోర్టు న్యాయమూర్తి తొలిగింపుకు అనుసరించే విధి విధానాలే అమలులో ఉంటాయి. నిరూపితమైన దుర్వినియోగం లేదా అసమర్థత కారణాలను చూపుతూ  పార్లమెంటులో ప్రత్యేక మెజారిటీతో ఆమోదం పొందిన తరువాత, రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా మాత్రమే అతనిని తొలగించగలరని భారత రాజ్యాంగంలోని అర్టికల్ 217 (1 బి), 124 (4) స్పష్టంగా చెప్పింది.


అయితే రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా వ్యవహరించిన రమేష్ కుమార్ ను తొలిగించలేదు. ఈ వ్యవహారంలో పరిస్థితి భిన్నంగా ఉంది.  ఎందుకంటే రమేష్ కుమార్ కు  స్వయంచాలిత పదవీ విరమణ లభించింది. మార్చబడిన చట్టాన్ని అనుసరించి రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పదవీ కాలం మూడు సంవత్సరాలు మాత్రమే. మరోవైపు హైకోర్టు మాజీ న్యాయమూర్తి అయి ఉండాలి. ఈ క్రమంలో రమేష్ కుమార్ మూడు సంవత్సరాల పదవీ కాలం ఇప్పటికే ముగిసింది, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పదవీకాలానికి సంబంధించి నూతన ఆర్డినెన్స్ తీసుకు వచ్చిన ప్రభుత్వం తద్వారా కొన్ని సవరణలు చేసినందున రమేష్ కుమర్ తన కార్యాలయంలో కొనసాగడానికి అర్హతను కోల్పోయారు. ఈ క్రమంలో2016 ఏప్రిల్ 1న 5 సంవత్సరాల పదవీ కాలానికి గాను నియమించబడిన  రమేష్ కుమార్, అనర్హత తలెత్తిన రోజు నుండి అంటే 2020 ఏప్రిల్ 10 నుండి పదవిలో కొనసాగే అవకాశం లేదు. తొలుత ఆర్డినెన్స్ జారీ ద్వారా పదవీకాలం 3 సంవత్సరాలకు తగ్గించబడింది, తరువాత పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ది విభాగం 2020 ఏప్రిల్ 20న నెంబర్  618 (ఇ అండ్ ఆర్) జిఓను విడుదల చేసింది.  ఆ జిఓ 2020 ఏప్రిల్ 10 నుండి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా డాక్టర్ ఎన్ రమేష్ కుమార్ పదవిని నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. నిజానికి ఇది అత్యంత స్పష్టంగా సాగిన వ్యవహారమనే చెప్పాలి. పంచాయితీ రాజ్ చట్టం 200 సెక్షన్ ను అనుసరించి, తాజా సవరణకు ముందున్న చట్ట నిబంధన ప్రకారం 5 సంవత్సరాలు పదవీ కాలం పూర్తి చేసినట్లయితే ఆ పదవి అప్పటితో ముగిసి పోతుంది. చట్టసవరణతో అది మూడు సంవత్సరాలకు కుదించబడటం వల్ల  రమేష్ కుమార్ ను పదవి నుండి తొలిగించారన్న  ప్రశ్న తలెత్తదు. కేవలం అయనది స్వయంచాలక పదవీ విరమణ మాత్రమే. అలహాబాద్ హైకోర్టులో డబ్యుపి 3457 (ఎంబి) కేసులో అపర్మితా ప్రసాద్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యుపి నడుమ కూడా ఇదే తరహా సమస్య న్యాయ సమీక్షకు గురైంది.  ఈ కేసులో గౌరవ హైకోర్టు "ఒకసారి అనర్హత అనేది ఎదురైనప్పుడు వారు కార్యాలయం నుండి స్వయంచాలక పదవీ విరమణ పొందుతారని స్పష్టం చేసింది ”.


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
పాలన... రాజకీయపరమైన నిర్ణయాల్లో యువత పాత్ర తప్పక ఉండాలి •ప్రభుత్వం ఏం చేస్తుందో యువత పట్టించుకోవడం మొదలుపెట్టాలి •రాజకీయాల్లో కొత్త తరం వచ్చే సమయం ఇది •రాజకీయాల్లో యువత భాగస్వామ్యం బలంగా ఉండాలన్నదే శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆకాంక్ష •కరోనా వల్ల తలెత్తిన ఈ క్లిష్ట పరిస్థితుల్లో యువత ఆత్మస్థైర్యంతో ఉండాలి •ఈబీసీ రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలు చేసి తీరాలి •వైద్య విద్యార్థులకు స్టైఫండ్ సకాలంలో ఇవ్వడంతోపాటు బోనస్ ప్రకటించాలి •జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు •విద్యార్థులు, యువత, మెడికోలతో వెబినార్ ద్వారా జనసేన చర్చా కార్యక్రమం ప్రభుత్వం మనల్ని పట్టించుకోవట్లేదు అనే భావనను యువత వదిలి... అసలు ప్రభుత్వం ఏం చేస్తుందో యువత పట్టించుకోవడం మొదలు పెడితే కచ్చితంగా పాలనలో మార్పు మొదలవుతుందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. రాజకీయ వ్యవస్థలో మార్పు తెచ్చే సత్తా యువతకు ఉందన్నారు. వర్తమానంలో పాలనపరమైన, రాజకీయపరమైన నిర్ణయాల్లో యువత పాత్ర తప్పక ఉండాలని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో యువత భాగస్వామ్యం బలంగా ఉండాలన్నదే జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆకాంక్ష అని తెలిపారు. పాలసీల రూపకల్పనలో60 - 70 ఏళ్ల వారిని నియమిస్తే వారు యువతకు తగ్గ ఆలోచనలు ఇవ్వలేరు, యువతకు పాలసీ రూపకల్పనలో భాగం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, జనసేన యువతకు ప్రధాన భాగం ఇస్తుందన్నారు. ఐదేళ్లుకోసారి ఓటు వేస్తే బాధ్యత అయిపోయినట్లే అని భావించకుండా ... వ్యవస్థల్లో జరగుతున్న అవినీతిని ప్రతిరోజు ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలన్నారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి వల్ల అనుకోని మార్పులు సంభవిస్తున్నాయనీ, విద్య, ఉపాధి అంశాల్లో చోటు చేసుకొంటున్న మార్పులకు యువత ధైర్యం కోల్పోరాదని సూచించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆత్మస్థైర్యంతో ఉంటే ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ధైర్యంగా ఉంటారన్నారు. కోవిడ్ 19 సమయంలో ఎదురైన సవాళ్లు, వాటిని యువత ఎదుర్కొన్న తీరు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై ఆదివారం మధ్యాహ్నం 13 జిల్లాలకు చెందిన విద్యార్ధులు, మెడికోలు, యువ వైద్యులతోపాటు యువత ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్జీవోల ప్రతినిధులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారితో వెబినార్ ద్వారా వివిధ అంశాలపై చర్చించారు. భీమిలి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ డా.పంచకర్ల సందీప్ ఈ వెబినార్ కు నేతృత్వం వహించారు. పలు సమస్యలపై విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “కరోనా కష్టకాలాన్ని అధిగమించడానికి యువత కీలక పాత్ర పోషిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ఇబ్బందుల్లో ఉన్నవారికి అండగా నిలిచి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వలస కూలీల ఆకలి తీర్చారు. కరోనాతో పోరాటం చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ కిట్లు, శానిటైజర్లు, మాస్క్ లు పంపిణీ చేశారు. నిస్వార్ధంగా, సేవాభావంతో పనిచేస్తున్న ఇలాంటి యువత భవిష్యత్తులో మంచి నాయకులుగా ఎదగాలని కోరుకుంటున్నాను. శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆశయాలు, జనసేన సిద్ధాంతాలను విద్యార్థులు, యువత ఆచరణలో చూపించారు. •పోరాటం మనవల్ల కాదులే అనుకోవద్దు దేశ భవిష్యత్తూ, జాతి భవిష్యత్తూ యువతపైనే ఉంది. కారణం దేశ జనాభాలో యువత అరవై శాతం పైనే కావడం. అంటే అద్భుతమైన మానవ వనరులున్న దేశం మనది. వాటిని మనం సక్రమంగా వినియోగించుకుంటే, జాగ్రత్తగా కాపాడుకుంటే దేశ ప్రగతిలో భాగస్వాములుగా చేస్తే ప్రపంచ దేశాలకు ధీటుగా మనం ఎన్నో అద్భుత ఆవిష్కరణలు చేయొచ్చు. వ్యవస్థతో పోరాటం చేయడం మన వల్ల కాదులే అనుకోవద్దు. వ్యవస్థలో మీరు కూడా భాగస్వాములే. ప్రభుత్వం, పాలన గురించి ప్రతిరోజు తెలుసుకుంటేనే నాయకులుగా ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు. తిత్లి తుఫాన్ సమయంలో శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఒక యువకుడు... మాకు 25 కేజీల బియ్యం కాదన్న... పాతికేళ్ల భవిష్యత్తు కావాలని అన్నాడు. యువత ఆలోచన విధానం ఆ విధంగా ఉన్నప్పుడే సమాజంలో మార్పు సాధ్యమవుతుంది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వాలు చాలా పెద్ద పెద్ద మాటలు చెబుతారు. విద్య, వైద్యానికి వేల కోట్లు కేటాయించామని గొప్పలు చెబుతాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. పాలకులు ఇప్పటికైనా ఆలోచన విధానాలను మార్చుకొని విద్యా, వైద్యంపై ఎక్కువ నిధులు ఖర్చు చేయగలిగితే దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. •ఈబీసీ రిజర్వేషన్ కోసం బలంగా నిలబడతాం సామాజికంగానూ, విద్యాపరంగానూ వెనకబడిన వర్గాలకు విద్యా, ఉద్యోగాలలో ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో దేశంలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇంకా అమలు చేయడం లేదు. ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని జనసేన బలంగా నిలబడుతుంది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్ధులను గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా స్వదేశీ ఉత్పత్తుల వినియోగం పెంచాలి. ‘మన ఉత్పత్తి, మన ఉపాధి, మన అభివృద్ధి’ అని శ్రీ పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పారు. ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని ఉచితంగా రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రతి రాష్ట్రానికి 8 లక్షల టన్నులు ఆహార ధాన్యాలను కేటాయించింది. అయితే ప్రతి రాష్ట్రం 6 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను మాత్రమే తీసుకున్నాయి. అందులో సరఫరా చేసింది 2 లక్షల టన్నులే. కరోనా విలయతాండవంలో ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న మెడికల్ స్టూడెంట్స్ కు గత నాలుగైదు నెలలుగా స్టైఫండ్ ఇవ్వకపోవడం బాధాకరం. జూలై 25న ప్రభుత్వానికి శ్రీ పవన్ కల్యాణ్ గారు విజ్ఞప్తి చేశారు. ఆ తరవాత నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో కూడా ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు అధికారులు స్టైఫండ్ రిలీజ్ చేయలేదు. ఇలాంటి కష్ట సమయంలో విధులు నిర్వర్తిస్తున్న మెడికోలకు స్టైఫెండ్ కాదు బోనస్ ఇవ్వాలి. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలం అవుతోంది. ప్రభుత్వం దిశా చట్టం కేవలం పబ్లిసిటీ కోసం తెచ్చింది తప్ప, మహిళలను రక్షించడానికి తీసుకువచ్చినట్లు నాకు అనిపించడం లేదు. రాజకీయాల్లో అవినీతి అనేది చాలా చిన్న పదంగా మారిపోయింది. రాజకీయాల్లోకి రావాలి కోట్లు వెనకేసుకోవాలి, రెండు మూడు లగ్జరీ కార్లు కొనాలి అనుకుంటున్నారే తప్ప ప్రజలకు సేవ చేద్దామని ఎవరూ అనుకోవడం లేదు. రాజకీయాలను కూడా ఒక కెరీర్ గా తీసుకుంటే తప్ప రాజకీయాల్లో మార్పు రాదు. జనసేన పార్టీ పరంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మంచి యువతను గుర్తించి నాయకులుగా తయారు చేద్దామని నిర్ణయించుకున్నాం” అన్నారు. డా.పంచకర్ల సందీప్ మాట్లాడుతూ “అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆలోచనలు జాతీయ స్థాయిలో ప్రభావితం చేసే స్థాయిలో ఉంటాయి. ఇటీవల విద్యా విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంశం ఆ కోవకు చెందినవే. లాక్డౌన్ సమయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా యువత ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తోంది” అన్నారు. అమెరికాలో చదువుతున్న శ్రీకాకుళంకి చెందిన వినీల్ విశ్వంభర దత్ మాట్లాడుతూ “జనసేన పార్టీలో పని చేయడం, వివిధ వర్గాల ప్రజలతో మమేకం అయిన అనుభవం నాకు అమెరికాలో ఉపయోగపడుతోంది. ఉచిత స్కీముల గురించి తప్ప, విద్యా విధానం గురించి మాట్లాడే పార్టీలు కరవయ్యాయి. శ్రీ పవన్ కల్యాణ్ గారు మాతృభాషా బోధన, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంశాలు మాట్లాడి భవిష్యత్ తరాల కోసం పుట్టిన పార్టీ జనసేన అని నిరూపించార”న్నారు. గుంటూరు జిల్లాకి చెందిన విద్యార్ధి కౌశిక్ మాట్లాడుతూ కోవిడ్ ముసుగులో కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజల్ని ఏ విధంగా దోచుకుంటున్నాయి, బ్రెజిల్, కెనడా లాంటి దేశాల్లో వైద్య విధానాలు ఎలా ఉంటాయన్న అంశాలు వెబినార్ లో పంచుకున్నారు. విశాఖకు చెందిన మెడికో డాక్టర్ యశ్వంత్ మాట్లాడుతూ “విపత్కాలంలో పని చేస్తున్నా ప్రభుత్వం స్టైఫండ్ ఇవ్వడం లేదు. ప్రభుత్వం జీవో విడుదల చేసింది తప్ప ఏమీ ఇవ్వలేదు. కోవిడ్ టెస్టులు నిర్వహించే వారికి అందుకు అవసరం అయిన నైపుణ్యాలు సరిగా లేవు. పీపీఈ కిట్స్, వెంటిలేటర్స్ తగినన్ని అందుబాటులో లేవు” అన్నారు. పంజాబ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్ధి శ్రీ సందీప్ మాట్లాడుతూ.. “లాక్ డౌన్ సమయంలో సొంత రాష్ట్రానికి రావడానికి విద్యార్ధులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ కొంత మంది అక్కడే ఉన్నారు. కాలేజీల యాజమాన్యాలు ఈ పరిస్థితుల్లో కూడా డెడ్ లైన్లు పెట్టి ఫీజులు వసూలు చేస్తున్నాయి” అన్నారు. నాగార్జున యూనివర్శిటీ విద్యార్ధిని కుమారి కావ్య మాట్లాడుతూ అర్హత ఉన్నా రైతులు ప్రభుత్వ పథకాలను పొందలేకపోతున్న అంశాన్ని, మహిళలు, మైనర్లపై జరుగుతున్న అత్యాచారాలను ప్రస్తావించారు. బయో ఇన్ఫోటెక్ సంస్థకు చెందిన పవన్ కెల్లా మాట్లాడుతూ “ప్రతి విద్యార్ధి కొత్త ఆలోచనలతో ముందుకు రావాలి. విద్యార్ధి దశలోనే తమ ఆలోచనలకు కాపీ రైట్, పేటెంట్ సాధించాలి. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాం. ఒకరు సాధించిన దాన్ని ఇంకొకరు దోచుకోని పరిస్థితి రావాలి” అన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన స్టార్టప్ ప్రొఫెషనల్ ఫయాజ్ మాట్లాడుతూ లెర్నింగ్ మిషన్, యువత ఆలోచనలకు రూపం ఇచ్చేందుకు క్షేత్ర స్థాయిలో కో ఆర్డినేషన్ విభాగం ఆవశ్యకతను వివరించారు. జనసేన పార్టీ భగత్ సింగ్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వెబినార్ లో ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో విద్యాభ్యాసం చేస్తున్న తెలుగు విద్యార్ధులు కలిపి సుమారు 200 మందికి పైగా పాల్గొన్నారు.
Image
ఇదీ వాటర్‌ గ్రిడ్‌
అన్నింటికీ అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు.