విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పిలుపుతో దాతల ముందడుగు


 
 :  రూ .5 లక్షల చెక్ లను ఎంపీ సమక్షంలో సీపీ కు అందజేస్తున్న ప్రతినిధులు
 
 
విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పిలుపుతో దాతల ముందడుగు
సమకూరిన రూ.5 లక్షలు నగదుని చెక్ రూపంలో విశాఖ నగర సీపీ(కమిషనర్ ఆఫ్ పోలీసు ) ఆర్.కే మీనాకు అందజేత
విశాఖపట్నం, ఏప్రిల్ 4
విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కరోన నియంత్రణకు పలువిధాలుగా తోడ్పాటు నందిస్తున్నారు. ఇప్పటికే అధికార యంత్రాంగం తో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యం లో కరోన కట్టడికి తనవంతు సహాయంగా  రూ. 25 లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే.. తాజాగా మరో  రూ.20 లక్షలు దాతలచేత ఇప్పించగా,ప్రస్త్తుతం 
ఓ అడుగు ముందుకు వేసి మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరోన నియంత్రణలో భాగంగా డాక్టర్లు, పారిశుధ్య కార్మికుల సేవలను పొగిడిన ఆయన , తాజాగా పోలీసులకు తోడ్పాటునందించారు. రాత్రనకా, పగలనకా పహారా కాస్తూ ప్రజారోగ్యాన్ని కాపాడి, అటు కేంద్రం ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి ఆదేశాలను తూ.చా తప్పకుండా విధులు నిర్వహిస్తున్న రక్షక భటుల కై నడుంబిగించారు. తన పార్లమెంట్ పరిధితో పాటు పలువురిని ఈ విషయంపై జాగృతాపరుస్తూ పోలీసులకు నిధులు సమకూర్చారు.సంధ్య ఆక్వా రూ.1 లక్ష, నెక్కంటి రూ.1 లక్ష ,సంధ్య మెరిన్స్ రూ.50 వేలు,తనిష్క్ షోరూం రూ.50 వేలు,మద్దినేని సురేష్ రూ.50 వేలు,సూర్య బిర్యానీస్ రూ.50 వేలు,కొమ్మి కిరణ్ కుమార్ రూ.50 వేలు ,ఎన్.సాయిభాస్కర్ రూ.50 వేలు 
 చొప్పున మొత్తం రూ.5  లక్షల రూపాయలను చెక్ రూపంలో  విశాఖ ఎంపీ సమక్షంలో విశాఖ నగర కమిషనర్ ఆర్.కే.మీనా కు, ఆయన కార్యాలయం లో అందజేశారు. ఈ మొత్తాన్ని పోలీసు అవసరాలకు వెచ్చించనున్నారు. ఈ సందర్భంగా ఎంపీ ఎంవీవీ మాట్లాడుతూ పోలీసు లు విధినిర్వహణలో చూపుతున్న చొరవను అభినందించారు. వారికి వెన్నుదన్నుగా నిలిచి , ఇతోధికంగా తోడ్పాటు నివ్వాలని పిలుపునిచ్చారు. నగర పరిధిలో సీపీ మీనా చేపడుతున్న కరోన నియంత్రణ చర్యలను అభినందించారు.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image