వాలంటీర్లపై పోలీసుల దాడికి నిరసనగా విధులను బహిష్కరించిన వాలంటీర్లు

*కరోన లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను పంపిణీ చేస్తున్న వాలంటీర్లపై పోలీసుల దాడికి నిరసనగా విధులను బహిష్కరించిన వాలంటీర్లు..!



కొడవలూరు.. నార్తురాజుపాలెం .......
ముఖ్యమంత్రి శ్రీ Y.S.జగన్మోహనరెడ్డి గారు
కరోనా కారణంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొడవలూరు మండలం నార్త్ రాజుపాళెం గ్రామంలో *(కందిపప్పు)* పంపిణీ చేస్తున్న వాలంటీర్లపై  పోలీసులు దురుసుగా ప్రవర్తించడమేగాక.,కొడవలూరు పోలీసు స్టేషన్ కు తీసుకెళ్ళి కుటుంబ సభ్యులతో కలిపి అసభ్య పదజాలంతో తిట్టడమే గాక కొట్టిన పోలీసు సిబ్బంది అయిన కృష్ణ మరియు గోవర్ధనరావు లను పై అధికారులు స్పందించి వెంటనే విధుల నుండి తొలగించి వారిపై చర్యలు తీసుకోవాలని...,అప్పటి వరకూ తాము విధులకు హాజరుకామని తెలిపిన నార్త్ రాజుపాళెం వాలంటీర్లు.