మెట్టలో బత్తాయి రైతులకు పుట్టెడు కష్టాలు..*.

*మెట్టలో బత్తాయి రైతులకు పుట్టెడు కష్టాలు..*.
*దివాళా తీసిన బత్తాయి రైతు*
*ఉదయగిరి, ఏప్రిల్ 6 (అంతిమతీర్పు ఇంచార్జ్-దయాకర్ రెడ్డి):: రాష్ట్రము లోనే బత్తాయి పంట కు ప్రసిద్ధి చెందిన వరికుంటపాడు మండలం లో ఆ పంట ను సాగు చేస్తున్న రైతు లు దివాళా తీస్తున్నారు. ఆరుగాలం శ్రమించి రెక్కలు ముక్కలు చేసుకుని సాగు చేసిన బత్తాయిలు చేతికి వచ్చే దశ లో కరోనా ఉపద్రవం తొ కుదేలు అయిపోయారు. మండలం లోని రామాపురం, కాకోళ్ళువారిపల్లి, హుస్సేన్నగర్, వేంపాడు, అశోక్ నగర్, తూర్పు రొంపిదొడ్ల, నరసింహపురం, పామూరు పల్లి, పెద్దిరెడ్డిపల్లి, కొండాయపాలెం, కృష్ణంరాజుపల్లి, కాంచెరువు గ్రామాల్లో బత్తాయి సాగు చేస్తున్నారు. ఈ గ్రామాల్లో సుమారు మూడు వేల ఎకరాలు కి పై బడి బత్తాయి తోట ని సాగు చేస్తున్నారు, ప్రతి ఏడాది మార్చ్, ఏప్రిల్ మాసాలలో నాణ్యమైన బత్తాయి కాయలు దిగుబడి అవుతాయి, కరోనా మహమ్మారి పుణ్యమా అని పంట ని కొనే వాడు లేకపోవడం రవాణా వ్యవస్థ స్తంభించి పోవడం తొ రైతు లు పరిస్థితి అగమ్యగోచరం గా మారింది. వేసవి మాసం వచ్చింది అంటే ఈ ప్రాంతం లోని రంగపురి రకం బత్తాయి లకు అధిక ప్రాధాన్యత ఉండేది. అయితే కరోనా దెబ్బకు ఎవరు బత్తాయి కొనుగోలు కి మొగ్గు చూపడం లేదు, ఫలితం గా నేల  రాలి పోతున్నాయి. గత ఏడాది ఇదే సీజన్లో టన్ను బత్తాయి ముప్పై వేలు ధర పలికింది అలాంటి పంట ఇప్పుడు కొనే వారు, అమ్మే వారు లేకపోవడం బాధాకరం. ఈ మాసాలలో నిత్యం కలకత్తా, ముంబై, చెన్నై, హైదరాబాద్ ప్రాంతాలకు వందల సంఖ్య లో బత్తాయి లోడ్ లు ఎగుమతి అయేవి, కానీ ప్రస్తుతం కొనుగోలు కోసం అడ్వాన్స్ లు ఇచ్చిన దళారులు కూడా మొఖం చాటేస్తున్నారు ఈ దెబ్బ తొ లక్ష లాది రూపాయలు పెట్టుబడి పెట్టి బత్తాయి సాగు చేసిన రైతు లు నిండా మునిగి పోయారు. రాయల సీమ లో చీనీ కాయలు గా తెలంగాణ లో మోసంబి గా పిలుచుకునే ఈ బత్తాయి లు ను  ప్రభుత్వం ఉద్యాన వన శాఖ ద్వారా కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టాలి అని రైతులు కోరుతున్నారు.