మెట్టలో బత్తాయి రైతులకు పుట్టెడు కష్టాలు..*.

*మెట్టలో బత్తాయి రైతులకు పుట్టెడు కష్టాలు..*.
*దివాళా తీసిన బత్తాయి రైతు*
*ఉదయగిరి, ఏప్రిల్ 6 (అంతిమతీర్పు ఇంచార్జ్-దయాకర్ రెడ్డి):: రాష్ట్రము లోనే బత్తాయి పంట కు ప్రసిద్ధి చెందిన వరికుంటపాడు మండలం లో ఆ పంట ను సాగు చేస్తున్న రైతు లు దివాళా తీస్తున్నారు. ఆరుగాలం శ్రమించి రెక్కలు ముక్కలు చేసుకుని సాగు చేసిన బత్తాయిలు చేతికి వచ్చే దశ లో కరోనా ఉపద్రవం తొ కుదేలు అయిపోయారు. మండలం లోని రామాపురం, కాకోళ్ళువారిపల్లి, హుస్సేన్నగర్, వేంపాడు, అశోక్ నగర్, తూర్పు రొంపిదొడ్ల, నరసింహపురం, పామూరు పల్లి, పెద్దిరెడ్డిపల్లి, కొండాయపాలెం, కృష్ణంరాజుపల్లి, కాంచెరువు గ్రామాల్లో బత్తాయి సాగు చేస్తున్నారు. ఈ గ్రామాల్లో సుమారు మూడు వేల ఎకరాలు కి పై బడి బత్తాయి తోట ని సాగు చేస్తున్నారు, ప్రతి ఏడాది మార్చ్, ఏప్రిల్ మాసాలలో నాణ్యమైన బత్తాయి కాయలు దిగుబడి అవుతాయి, కరోనా మహమ్మారి పుణ్యమా అని పంట ని కొనే వాడు లేకపోవడం రవాణా వ్యవస్థ స్తంభించి పోవడం తొ రైతు లు పరిస్థితి అగమ్యగోచరం గా మారింది. వేసవి మాసం వచ్చింది అంటే ఈ ప్రాంతం లోని రంగపురి రకం బత్తాయి లకు అధిక ప్రాధాన్యత ఉండేది. అయితే కరోనా దెబ్బకు ఎవరు బత్తాయి కొనుగోలు కి మొగ్గు చూపడం లేదు, ఫలితం గా నేల  రాలి పోతున్నాయి. గత ఏడాది ఇదే సీజన్లో టన్ను బత్తాయి ముప్పై వేలు ధర పలికింది అలాంటి పంట ఇప్పుడు కొనే వారు, అమ్మే వారు లేకపోవడం బాధాకరం. ఈ మాసాలలో నిత్యం కలకత్తా, ముంబై, చెన్నై, హైదరాబాద్ ప్రాంతాలకు వందల సంఖ్య లో బత్తాయి లోడ్ లు ఎగుమతి అయేవి, కానీ ప్రస్తుతం కొనుగోలు కోసం అడ్వాన్స్ లు ఇచ్చిన దళారులు కూడా మొఖం చాటేస్తున్నారు ఈ దెబ్బ తొ లక్ష లాది రూపాయలు పెట్టుబడి పెట్టి బత్తాయి సాగు చేసిన రైతు లు నిండా మునిగి పోయారు. రాయల సీమ లో చీనీ కాయలు గా తెలంగాణ లో మోసంబి గా పిలుచుకునే ఈ బత్తాయి లు ను  ప్రభుత్వం ఉద్యాన వన శాఖ ద్వారా కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టాలి అని రైతులు కోరుతున్నారు.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image