ప్రభుత్వ శాఖల సిబ్బందికి భోజనాలు పంపిణీ

ప్రభుత్వ శాఖల సిబ్బందికి భోజనాలు పంపిణీ


వింజమూరు, ఏప్రిల్ 22 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): కరోనా వైరస్ నియంత్రణ కోసం నిరంతరం శ్రమిస్తున్న వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది, విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులకు బుధవారం నాడు స్థానిక బి.సి కాలనీకి చెందిన వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నేత భోజనపు.గోపి భోజనాల ప్యాకెట్లును అందజేశారు. ఇందులో భాగంగా వాలంటీర్లు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, రెవిన్యూ శాఖ సిబ్బంది, యం.పి.డి.ఓ కార్యాలయం సిబ్బందికి భోజనాలు పంపిణీ చేస్తూ వారి వారి సేవలను కొనియాడారు. కరోనా వైరస్ నియంత్రణకు అహర్నిశలూ శ్రమిస్తూ ఉన్న ఈ శాఖల ఉద్యోగులు, సిబ్బందికీ ప్రజలందరూ రుణపడి ఉంటారన్నారు. వింజమూరు మండలమును గ్రీన్ జోన్ పరిధిలోకి తెచ్చేందుకు పాటుపడిన తహసిల్ధారు సుధాకర్ రావు, ఎస్.ఐ బాజిరెడ్డి, యం.పి.డి.ఓ కనకదుర్గా భవానీ, వైధ్యాధికారి హరిక్రిష్ణలు నిత్య కృషీవలురని గోపి కొనియాడారు. ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి, ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి.చంద్రశేఖర్ రెడ్డిల ఆశయాలకు అనుగుణంగా ఈ కరోనా కాలంలో ప్రజలకు తమ వంతు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉంటామన్నారు. స్థానిక తహసిల్ధారు కార్యాలయంలో డిప్యూటీ తహసిల్ధారు మురళీధర్ రాజు చేతుల మీదుగా భోజనాల పంపిణీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భోజనపు.దివ్యశ్రీ, భోజనపు.అర్జున్, రమేష్, ఆనంద్, చంద్ర, నవీన్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
క్రియేటివ్ సోల్ నేతృత్వంలో సెప్టెంబరు 28న ఎస్ఎస్ కన్వేన్షన్ సెంటర్లో
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
Dr.కోట సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ
Image
నిబంధనలు దిక్కరిస్తే పోలీసులు తమ చర్యలు విషయంలో వెనకడుగు వేయవద్దు..