22న ఎమ్ఎస్ఎమ్ఈలకు చెల్లింపులు : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

 


తేదీ: 13-05-2020,
అమరావతి.


*పెట్టుబడులు ఆకర్షించేందుకు అనువైన సమయమిదే : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి


మే 22న ఎమ్ఎస్ఎమ్ఈలకు చెల్లింపులు


* తయారీ పరిశ్రమల ఏర్పాటుకు భారతదేశమే గమ్యస్థానం


* ప్రధాని ఆర్థిక ప్యాకేజీ ప్రకటనలో సీఎం జగన్ కోరిన అంశాలనుప్రస్తావించిన మోదీ


* ముఖ్యమంత్రికి ముందుచూపుకు, దార్శనికతకు ఇదే నిదర్శనం


* కేంద్ర ప్రభుత్వం కన్నా, ఇతర రాష్ట్రాల కన్నా ముందే ఎమ్ఎస్ఎమ్ఈల కోసం చర్యలు చేపట్టిన తొలి రాష్ట్రం మనదే


* ఎమ్ఎస్ఎమ్ఈ, వ్యవసాయరంగం, అనుబంధ పరిశ్రమలలకు కేంద్రం సాయం చేస్తుందని ఆశాభావం


* కరోనా నివారణలో ముందున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్


* వాస్తవాలను ఎప్పటికప్పుడూ స్పష్టంగా చెబుతూ ప్రజలకు భరోసా ఇచ్చిన సీఎం  వైఎస్ జగన్


* కోవిడ్ విజృంభణ నేపథ్యంలో పెట్టుబడులకు ఇతర దేశాల కన్నా భారత్ అనుకూలం


* అందులోనూ అన్ని రాష్ట్రాల్లోకెల్లా ఆంధ్రప్రదేశ్ లోనే  పెట్టుబడులకు ఎక్కువ అవకాశాలు


* పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం సూచన మేరకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు


* పరిశ్రమలు తీసుకురావడానికి ఈడీబీ, టాస్క్ ఫోర్స్ సమన్వయంతో ముందుకెళతాయి


* విధివిధానాల తయారీపై దృష్టి పెట్టాలని మంత్రి మేకపాటి ఆదేశం


* ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం, అనంతర పరిణామాలపైనా మంత్రి చర్చ


* విదేశీ పరిశ్రమలపై చర్యలకు కొన్ని పద్ధతులు ఉంటాయి. వాటిని అనుసరించి ముందుకెళుతున్నాం. 


* ప్రతిపక్షాల కన్నా ముందే  ప్రజాక్షేమం కోసం ఆలోచించే నాయకుడు ముఖ్యమంత్రి


* ప్రభుత్వానికి రెవెన్యూ లోటున్నా, ప్రజలకు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళుతోంది


* విచారణ అనంతరం,  దోషులెవరైనా ఎలాంటి చర్యలకైనా వెనుకాడబోము


* 13 జిల్లాలలో అన్ని పరిశ్రమలనూ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం


* క్రమంగా తగు జాగ్రత్తలు పాటిస్తూ ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు