శరవేగంగా గ్రామ సచివాలయ భవన నిర్మాణలు

*శరవేగంగా గ్రామ సచివాలయ భవన నిర్మాణలు*
వరికుంటపాడు 
వరికుంటపాడు మండలం లో గ్రామ సచివాలయ నిర్మాణాల పనులు శరవేగంగా నిర్మితమవుతున్నాయి. మండలం లో 12 గ్రామ సచివాలయాలు ఉన్నాయి,  ఇందులో 4 సచివాలయాల్లో నిర్మాణ పనులు జోరు అందుకున్నాయి. ఒక్కొక్కటి రూ 35 లక్షలు వ్యయం తో నిర్మిస్తున్న 12 సచివాలయాలు కి గాను ఎనిమిదింటి లో పనులు జరుగుతుండగా వాటిల్లో 4 సచివాలయాలు నిర్మాణ పనులు జోరు అందుకున్నాయి. తూర్పు బోయమడుగుల, కాంచెరువు, గణేశ్వరపురం సచివాలయాలు కి సంబంధించి స్లాబ్ పూర్తి కాగా పై అంతస్థు పనులు  కూడా ప్రారంభం కానున్నాయి. ఇవి పూర్తి అయితే గ్రామీణ ప్రజలకు ఎంతో సౌకర్యం కానుంది.