వైసీపీ లో చేరిన కాపు నాయకుడు ఊసా వెంకటరావు

వైసీపీ లో చేరిన కాపు నాయకుడు ఊసా వెంకటరావు ...


కావలి ,మే 12(అంతిమ తీర్పు - N. సాయి )
కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాపకుమార్ రెడ్డి నాయకత్వానికి అమలుచేస్తున్న సంక్షేమ  పథకాలకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో వున్న  34 వ వార్డుకు చెందిన కాపు నాయకుడు  ఊసా వెంకటరావు ఎమ్మెల్యే చేతులమీదుగా  
 ఊసా వెంకటరావు,  ఆయన అనుచరులు పార్టీ కండువాలు కప్పించుకొన్నారు . వైస్సార్సీపీ తీర్ధం తీసుకొన్న ఊసా మాట్లాడుతూ తాను 20 సంవత్సరాలుగా తెలుగుదేశంలో వున్నానని , జగన్మోహనరెడ్డి ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పధకం , కాపులకు అందిస్తున్న సంక్షేమ  పథకాలు నన్ను వైస్సార్సీపీ కి దగ్గర చేశాయన్నారు . ప్రతాపకుమార్ రెడ్డి 2024 లో కూడా ఎమ్మెల్యే అయి హ్యాట్రిక్ సాధించాలని ఆయన తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు . ఎమ్మెల్యే , ఏఎంసీ చైర్మన్ ల మంచితనం , నిబద్ధత నచ్చి తాను వైస్సార్సీపీలోకి వచ్చానన్నారు .
 ఈ చేరికల్ని ఉద్దేశించి  ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపకుమార్ రెడ్డి మాట్లాడుతూ - లాక్ డౌన్ కారణంగా భౌతిక దూరం పాటించాల్సిన పరిస్థితులు వున్నందున ఇంకా చాలామందిని చేర్చుకోలేకపోయామన్నారు . లాక్ డౌన్ అనంతరం పట్టణంలో ఇంకా చాలా మంది  పార్టీలో చేరే అవకాశాలున్నాయన్నారు . ముఖ్యమంత్రి నెరవేరుస్తున్న హామీలకు , సంక్షేమ పథకాల అమలుకు అందరూ ఆకర్షితులవుతున్నారన్నారు . వూసా 34 వ వార్డుకే పరిమితి కాకుండా పట్టణంలోని కాపునాయకుల్ని సమన్వయపరుస్తూ పార్టీని బలోపేతం చేయాలని కోరారు . కరోనా సమయంలో కష్టపడుతున్న ప్రభుత్వ ఉద్యోగులకు , వివిధ శాఖల అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు . ఊసా చేరికతో 34 వ వార్డు వైస్సార్సీపీ కి కంచుకోటగా నిలిచిందని , ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ వార్డు వైస్సార్సీపీ ఖాతాలో పడడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు . 
ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి మాట్లాడుతూ - రాబోయే 2024 ఎన్నికల్లో తిరిగి రామిరెడ్డి ప్రతాపకుమార్ రెడ్డి విజయంసాధించి చరిత్ర తిరగరాయడం ఖాయమన్నారు .  2024 ఎన్నికల్లో ప్రతాపకుమార్ రెడ్డి పై పోటీచేయాలంటే ఎవరయినా భయపడే విధంగా పార్టీని బలోపేతంచేస్తూ ముందుకు తీసుకెళతామన్నారు . జిల్లా తెలుగుదేశం ఉపాధ్యక్షులు ఊసా వెంకటరావు లాంటి ఎంతోమంది ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పథకాలకు ఆకర్షితులై వైస్సార్సీపీ లో చేరుతున్నారన్నారు .
కార్యక్రమంలో పట్టణ వైస్సార్సీపీ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి , మాజీ మండలాధ్యక్షుడు నాయుడు రాం ప్రసాద్ , మాజీ మునిసిపల్ ఫ్లోర్ లీడర్ కనమర్లపూడి వెంకట నారాయణ తదితర వైస్సార్సీపీ మాజీ కౌన్సిలర్లు , నాయకులు పాల్గొన్నారు


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
మెట్టలో బత్తాయి రైతులకు పుట్టెడు కష్టాలు..*.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
శ్రీ‌వారి ఆల‌య మాడ వీధుల్లో శ్రీ ఉగ్ర‌శ్రీ‌నివాస‌మూర్తి ద‌ర్శ‌నం
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు