ప్రజల సంక్షేమం, భద్రతే ప్రభుత్వానికి ముఖ్యము -కంపెనీ కాదు.: జిల్లా ఇన్ చార్జ్, రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కురసాల కన్నబాబు


• ప్రజల సంక్షేమం, భద్రతే ప్రభుత్వానికి ముఖ్యము -కంపెనీ కాదు.
• మొత్తం బాధితులు 585 మందికి చికిత్స జరుగుతుంది
• 418 మంది కెజిహెచ్ లో, 111 మంది డిశ్చార్జ్, 307 మందికి చికిత్స జరుగుతుంది, 167 మంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో, 67 మంది డిశ్చార్జ్, 105 మందికి చికిత్స జరుగుతుంది
• దేశంలోని అత్యున్నత కమిటీలచే అధ్యయనం
• పారా మీటర్లను అధ్యయనం చేసి ప్రజలు 5 గ్రామాలకు వెల్లవచ్చని ప్రకటిస్తారు
విలేఖరుల సమావేశంలో వెల్లడించిన                                                                                   జిల్లా ఇన్ చార్జ్, రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కురసాల కన్నబాబు
  విశాఖపట్నం,మే,9ః ఎల్.జి. పాలిమర్స్ గ్యాస్ లీకేజి పొల్యూషన్ పూర్తి స్థాయిలో అదుపులో ఉందని జిల్లా ఇన్ చార్జ్, రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కురసాల కన్నబాబు చెప్పారు.  ఎల్.జి.పాలీమర్స్ గ్యాస్ లీకేజి పొల్యూషన్ పై ఆయన రాష్ట్ర మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్థి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర రహదారులు, భవనాలు శాఖ మంత్రి ధర్మాన కృష్ణ దాసు, జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ లతో ఆయన విలేఖరుల సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లీకేజి ప్రభావం నుండి ఆ ప్రాంతం కోలుకుంటుందని, గాలిలో కలసిన గ్యాస్ ప్రభావం తగ్గుతుందని, 8వ తేదీ రాత్రి 7 గంటలకు 17.5 పిపిఎం ఉన్నదని, ప్రస్తుతం 1.9 పిపిఎం ఉన్నదని, చాలా వేగంగా తగ్గుతుందని చెప్పారు.  స్టోరేజి పాయింట్ వద్ద చాలా వేగంగా తగ్గుతుందన్నారు. అక్కడ పెద్ద ఎత్తున నీటిని నిలువ చేయడం జరుగుతుదని,  గ్రామాల వద్ద రేపు సాయంత్రం పారా మీటర్లను అద్యయం చేసి 5 గ్రామాల ప్రజలు తమ గ్రామాలకు వెళ్లవచ్చుని ప్రకటిస్తారని తెలిపారు. అంతర్గత కమిటీ ఉంటుందని, ఇందులో ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డైరక్టర్ అధ్యక్షతన ఒక కమిటీ ఉంటుందని తెలిపారు.  ఆంధ్రా యూనివర్శిటీ ప్రొఫసర్లతో ఒక కమిటీ ఉంటుందని, ఇందులో ఎస్. బాల ప్రసాద్ అధ్యక్షతన వివిధ రంగాలలో అధ్యయనం చేస్తుందని చెప్పారు.  ఐఐఎస్ఇఆర్ అధ్యయనం చేసి సూచనలు, సాంకేతిక అంశాలపైన సలహాలు ఇస్తారన్నారు.  కేబినెట్ కార్యదర్శి ఒక కమిటీని పంపిస్తున్నారని, ఇందులో ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ ఉంటారని పేర్కొన్నారు.  నేషనల్ ఎన్విరాన్ మెంటల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (నీరి) నుండి 5 గురు సభ్యులతో కూడి బృందం వచ్చి నీటి వనరులు, తదితర వాటిపై ఎప్పటికప్పుడు అప్రమత్తత చేసే సూచనలు ఇస్తుందని, ఎన్డిఆర్ఎఫ్ నుండి నాగ్ పూర్ నుండి ఒక టీం వచ్చిందని, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిదేదికలను ప్రభుత్వానికి అందజేస్తారుని పేర్కొన్నారు.  మెడికల్ అండ్ హెల్త్ కమిటీ ఉంటుందని ఇందులో డిఎంహెచ్ఓ, డిసిహెచ్ఎస్, కెజిహెచ్ పర్యవేక్షకులు ఉంటారని, వీరు గ్యాస్ లీకేజి ప్రజలపై  ఏ విధమైన ప్రభావం చూపుతుందనే విషయాలను అధ్యయనం చేస్తారని, వీరు రేపటి నుండే అధ్యయనం ప్రారంభిస్తారని చెప్పారు.  ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్న వారిపై అధ్యయనం చేస్తారని తెలిపారు.  ఎల్.జి. పాలిమర్స్ గ్యాస్ లీక్ సంఘటనలో 5 గ్రామాల నుండి మొత్తం 585 మంది ఆసుపత్రుల్లో చేరారని, 418 మంది కెజిహెచ్ లోను, ఇందులో 111 మందిని డిశ్చార్జి చేయడం జరిగిందని, 307 మందికి చికిత్స అందుతుందని, 167 మంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స జరుగుతుందని, 62 మంది డిశ్చార్జి చేసినట్లు చెప్పారు.  24*7 సమయం వైద్య సేవలు అందించడం జరుగుతుందని చెప్పారు.  వైద్యానికి ఎంత ఖర్చు అయినా ప్రభుత్వమే భరిస్తుందన్నారు.  సంఘటలో 12 మంది మరణించారని, పోస్టుమార్టం అనంతరం ఈ రోజు మృత దేహాలను వారి బందువులకు అప్పగించడమైనదని, ఆర్థిక సహాయంగా ఒక్కొక్కరికి కోటి రూపాయలు ముఖ్యమంత్రి ప్రకటించారని తెలిపారు.  లీగల్ హెయిర్ రిపోర్టు అధికారులు రేపు తెప్పిస్తారని చెప్పారు.  పరిహారం మొత్తం అందిస్తామని తెలిపారు.  ఇందుకు ప్రభుత్వం జిఓ కూడా జారీ చేయడమైనదని స్పష్టం చేశారు.  పాడి పశువుల ఎన్యూమరేషన్ పూర్తి అయిందని, ఏ ఒక్క రైతు నష్ట పోకుండా ఉండేందుకు నష్ట పరిహారం పూర్తి గా అందించడం జరుగుతుందని తెలిపారు.  విశాఖ, పరిసర ప్రాంతంలొ కెమికల్స్ ఇండస్ట్రీస్ లలో నిలువ ఉన్న రసాయనాలను కమిటీలు పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తారన్నారు.  ఎస్.ఓ.పి.ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని, ఆ నిబంధనలకు అనుగుణంగానే చేయనున్నట్లు చెప్పారు.  విశాఖ ఒక సేఫ్ జోన్ ఉండే విధంగా అధ్యయనం చేస్తారని తెలిపారు.  గ్రామాల్లో పాలీమర్స్ ప్రభావం ఎంత వరకు ఉన్నదీ గ్రామాల్లో ఎక్కడెక్కడ వాటర్ ట్యాంకులు ఉన్నాయో వాటిని వాడవద్దని ఎక్స్పర్ట్స్ చెప్పినట్లు తెలిపారు. బోర్ వెల్స్ ను పరిశీలిస్తారని చెప్పారు.  మేగాద్రి గెడ్డ నీటిని జివియంసి ఇప్పటికే నిలిపివేసినట్లు చెప్పారు.  స్టైరీన్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో మార్గదర్శకాలను కమిటీలు సూచిస్తాయని పేర్కొన్నారు.  వివిధ కమిటీల అధ్యయనం తరువాత ఇచ్చిన నివేధికలు ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని, అంతవరకు కంపెనీ తెరవబడదని చెప్పారు.  
  రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ సంఘటనలో బాధితులను ఆదుకోడానికి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని, అధికార యంత్రాంగం తక్షణమే అప్రమత్త్తం గావించిందన్నారు.  క్రింది స్థాయి నుండి ఛీఫ్ సెక్రటరీ, డిజిపి స్థాయి వరకు అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారని, 7 గురు మంత్రులపై బాధ్యత ఉంచారని, వారు నిరంతరం పర్యవేక్షిస్తూ అక్కడి ప్రజల క్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్నారని తెలిపారు.  
  రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్థి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, బధ్రత ప్రభుత్వానికి ముఖ్యమని, కంపెనీ కాదని స్పష్టం చేశారు.  దీని కోసం పూర్తి స్థాయిలో చర్యలు చేపుతున్నామన్నారు. 5 గ్రామాల ప్రజలను తిరిగి వారి ఇళ్ళకు క్షేమంగా పంపడానికి ఆలోచిస్తున్నామన్నారు.  సంఘటనపై కమిటీలను వేయించడం జరిగిందని, నివేదిక రాగానే కంపెనీపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.


 


Popular posts
Devi Navarathrulu...* *DAY 7 ALANKARAM*
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
సిమెంట్ ధరల వ్యత్యాసం నియంత్రణ కు "వైయస్ఆర్ నిర్మాణ్” ప్రారంభం
Image
పాలన... రాజకీయపరమైన నిర్ణయాల్లో యువత పాత్ర తప్పక ఉండాలి •ప్రభుత్వం ఏం చేస్తుందో యువత పట్టించుకోవడం మొదలుపెట్టాలి •రాజకీయాల్లో కొత్త తరం వచ్చే సమయం ఇది •రాజకీయాల్లో యువత భాగస్వామ్యం బలంగా ఉండాలన్నదే శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆకాంక్ష •కరోనా వల్ల తలెత్తిన ఈ క్లిష్ట పరిస్థితుల్లో యువత ఆత్మస్థైర్యంతో ఉండాలి •ఈబీసీ రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలు చేసి తీరాలి •వైద్య విద్యార్థులకు స్టైఫండ్ సకాలంలో ఇవ్వడంతోపాటు బోనస్ ప్రకటించాలి •జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు •విద్యార్థులు, యువత, మెడికోలతో వెబినార్ ద్వారా జనసేన చర్చా కార్యక్రమం ప్రభుత్వం మనల్ని పట్టించుకోవట్లేదు అనే భావనను యువత వదిలి... అసలు ప్రభుత్వం ఏం చేస్తుందో యువత పట్టించుకోవడం మొదలు పెడితే కచ్చితంగా పాలనలో మార్పు మొదలవుతుందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. రాజకీయ వ్యవస్థలో మార్పు తెచ్చే సత్తా యువతకు ఉందన్నారు. వర్తమానంలో పాలనపరమైన, రాజకీయపరమైన నిర్ణయాల్లో యువత పాత్ర తప్పక ఉండాలని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో యువత భాగస్వామ్యం బలంగా ఉండాలన్నదే జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆకాంక్ష అని తెలిపారు. పాలసీల రూపకల్పనలో60 - 70 ఏళ్ల వారిని నియమిస్తే వారు యువతకు తగ్గ ఆలోచనలు ఇవ్వలేరు, యువతకు పాలసీ రూపకల్పనలో భాగం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, జనసేన యువతకు ప్రధాన భాగం ఇస్తుందన్నారు. ఐదేళ్లుకోసారి ఓటు వేస్తే బాధ్యత అయిపోయినట్లే అని భావించకుండా ... వ్యవస్థల్లో జరగుతున్న అవినీతిని ప్రతిరోజు ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలన్నారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి వల్ల అనుకోని మార్పులు సంభవిస్తున్నాయనీ, విద్య, ఉపాధి అంశాల్లో చోటు చేసుకొంటున్న మార్పులకు యువత ధైర్యం కోల్పోరాదని సూచించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆత్మస్థైర్యంతో ఉంటే ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ధైర్యంగా ఉంటారన్నారు. కోవిడ్ 19 సమయంలో ఎదురైన సవాళ్లు, వాటిని యువత ఎదుర్కొన్న తీరు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై ఆదివారం మధ్యాహ్నం 13 జిల్లాలకు చెందిన విద్యార్ధులు, మెడికోలు, యువ వైద్యులతోపాటు యువత ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్జీవోల ప్రతినిధులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారితో వెబినార్ ద్వారా వివిధ అంశాలపై చర్చించారు. భీమిలి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ డా.పంచకర్ల సందీప్ ఈ వెబినార్ కు నేతృత్వం వహించారు. పలు సమస్యలపై విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “కరోనా కష్టకాలాన్ని అధిగమించడానికి యువత కీలక పాత్ర పోషిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ఇబ్బందుల్లో ఉన్నవారికి అండగా నిలిచి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వలస కూలీల ఆకలి తీర్చారు. కరోనాతో పోరాటం చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ కిట్లు, శానిటైజర్లు, మాస్క్ లు పంపిణీ చేశారు. నిస్వార్ధంగా, సేవాభావంతో పనిచేస్తున్న ఇలాంటి యువత భవిష్యత్తులో మంచి నాయకులుగా ఎదగాలని కోరుకుంటున్నాను. శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆశయాలు, జనసేన సిద్ధాంతాలను విద్యార్థులు, యువత ఆచరణలో చూపించారు. •పోరాటం మనవల్ల కాదులే అనుకోవద్దు దేశ భవిష్యత్తూ, జాతి భవిష్యత్తూ యువతపైనే ఉంది. కారణం దేశ జనాభాలో యువత అరవై శాతం పైనే కావడం. అంటే అద్భుతమైన మానవ వనరులున్న దేశం మనది. వాటిని మనం సక్రమంగా వినియోగించుకుంటే, జాగ్రత్తగా కాపాడుకుంటే దేశ ప్రగతిలో భాగస్వాములుగా చేస్తే ప్రపంచ దేశాలకు ధీటుగా మనం ఎన్నో అద్భుత ఆవిష్కరణలు చేయొచ్చు. వ్యవస్థతో పోరాటం చేయడం మన వల్ల కాదులే అనుకోవద్దు. వ్యవస్థలో మీరు కూడా భాగస్వాములే. ప్రభుత్వం, పాలన గురించి ప్రతిరోజు తెలుసుకుంటేనే నాయకులుగా ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు. తిత్లి తుఫాన్ సమయంలో శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఒక యువకుడు... మాకు 25 కేజీల బియ్యం కాదన్న... పాతికేళ్ల భవిష్యత్తు కావాలని అన్నాడు. యువత ఆలోచన విధానం ఆ విధంగా ఉన్నప్పుడే సమాజంలో మార్పు సాధ్యమవుతుంది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వాలు చాలా పెద్ద పెద్ద మాటలు చెబుతారు. విద్య, వైద్యానికి వేల కోట్లు కేటాయించామని గొప్పలు చెబుతాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. పాలకులు ఇప్పటికైనా ఆలోచన విధానాలను మార్చుకొని విద్యా, వైద్యంపై ఎక్కువ నిధులు ఖర్చు చేయగలిగితే దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. •ఈబీసీ రిజర్వేషన్ కోసం బలంగా నిలబడతాం సామాజికంగానూ, విద్యాపరంగానూ వెనకబడిన వర్గాలకు విద్యా, ఉద్యోగాలలో ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో దేశంలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇంకా అమలు చేయడం లేదు. ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని జనసేన బలంగా నిలబడుతుంది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్ధులను గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా స్వదేశీ ఉత్పత్తుల వినియోగం పెంచాలి. ‘మన ఉత్పత్తి, మన ఉపాధి, మన అభివృద్ధి’ అని శ్రీ పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పారు. ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని ఉచితంగా రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రతి రాష్ట్రానికి 8 లక్షల టన్నులు ఆహార ధాన్యాలను కేటాయించింది. అయితే ప్రతి రాష్ట్రం 6 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను మాత్రమే తీసుకున్నాయి. అందులో సరఫరా చేసింది 2 లక్షల టన్నులే. కరోనా విలయతాండవంలో ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న మెడికల్ స్టూడెంట్స్ కు గత నాలుగైదు నెలలుగా స్టైఫండ్ ఇవ్వకపోవడం బాధాకరం. జూలై 25న ప్రభుత్వానికి శ్రీ పవన్ కల్యాణ్ గారు విజ్ఞప్తి చేశారు. ఆ తరవాత నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో కూడా ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు అధికారులు స్టైఫండ్ రిలీజ్ చేయలేదు. ఇలాంటి కష్ట సమయంలో విధులు నిర్వర్తిస్తున్న మెడికోలకు స్టైఫెండ్ కాదు బోనస్ ఇవ్వాలి. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలం అవుతోంది. ప్రభుత్వం దిశా చట్టం కేవలం పబ్లిసిటీ కోసం తెచ్చింది తప్ప, మహిళలను రక్షించడానికి తీసుకువచ్చినట్లు నాకు అనిపించడం లేదు. రాజకీయాల్లో అవినీతి అనేది చాలా చిన్న పదంగా మారిపోయింది. రాజకీయాల్లోకి రావాలి కోట్లు వెనకేసుకోవాలి, రెండు మూడు లగ్జరీ కార్లు కొనాలి అనుకుంటున్నారే తప్ప ప్రజలకు సేవ చేద్దామని ఎవరూ అనుకోవడం లేదు. రాజకీయాలను కూడా ఒక కెరీర్ గా తీసుకుంటే తప్ప రాజకీయాల్లో మార్పు రాదు. జనసేన పార్టీ పరంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మంచి యువతను గుర్తించి నాయకులుగా తయారు చేద్దామని నిర్ణయించుకున్నాం” అన్నారు. డా.పంచకర్ల సందీప్ మాట్లాడుతూ “అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆలోచనలు జాతీయ స్థాయిలో ప్రభావితం చేసే స్థాయిలో ఉంటాయి. ఇటీవల విద్యా విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంశం ఆ కోవకు చెందినవే. లాక్డౌన్ సమయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా యువత ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తోంది” అన్నారు. అమెరికాలో చదువుతున్న శ్రీకాకుళంకి చెందిన వినీల్ విశ్వంభర దత్ మాట్లాడుతూ “జనసేన పార్టీలో పని చేయడం, వివిధ వర్గాల ప్రజలతో మమేకం అయిన అనుభవం నాకు అమెరికాలో ఉపయోగపడుతోంది. ఉచిత స్కీముల గురించి తప్ప, విద్యా విధానం గురించి మాట్లాడే పార్టీలు కరవయ్యాయి. శ్రీ పవన్ కల్యాణ్ గారు మాతృభాషా బోధన, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంశాలు మాట్లాడి భవిష్యత్ తరాల కోసం పుట్టిన పార్టీ జనసేన అని నిరూపించార”న్నారు. గుంటూరు జిల్లాకి చెందిన విద్యార్ధి కౌశిక్ మాట్లాడుతూ కోవిడ్ ముసుగులో కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజల్ని ఏ విధంగా దోచుకుంటున్నాయి, బ్రెజిల్, కెనడా లాంటి దేశాల్లో వైద్య విధానాలు ఎలా ఉంటాయన్న అంశాలు వెబినార్ లో పంచుకున్నారు. విశాఖకు చెందిన మెడికో డాక్టర్ యశ్వంత్ మాట్లాడుతూ “విపత్కాలంలో పని చేస్తున్నా ప్రభుత్వం స్టైఫండ్ ఇవ్వడం లేదు. ప్రభుత్వం జీవో విడుదల చేసింది తప్ప ఏమీ ఇవ్వలేదు. కోవిడ్ టెస్టులు నిర్వహించే వారికి అందుకు అవసరం అయిన నైపుణ్యాలు సరిగా లేవు. పీపీఈ కిట్స్, వెంటిలేటర్స్ తగినన్ని అందుబాటులో లేవు” అన్నారు. పంజాబ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్ధి శ్రీ సందీప్ మాట్లాడుతూ.. “లాక్ డౌన్ సమయంలో సొంత రాష్ట్రానికి రావడానికి విద్యార్ధులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ కొంత మంది అక్కడే ఉన్నారు. కాలేజీల యాజమాన్యాలు ఈ పరిస్థితుల్లో కూడా డెడ్ లైన్లు పెట్టి ఫీజులు వసూలు చేస్తున్నాయి” అన్నారు. నాగార్జున యూనివర్శిటీ విద్యార్ధిని కుమారి కావ్య మాట్లాడుతూ అర్హత ఉన్నా రైతులు ప్రభుత్వ పథకాలను పొందలేకపోతున్న అంశాన్ని, మహిళలు, మైనర్లపై జరుగుతున్న అత్యాచారాలను ప్రస్తావించారు. బయో ఇన్ఫోటెక్ సంస్థకు చెందిన పవన్ కెల్లా మాట్లాడుతూ “ప్రతి విద్యార్ధి కొత్త ఆలోచనలతో ముందుకు రావాలి. విద్యార్ధి దశలోనే తమ ఆలోచనలకు కాపీ రైట్, పేటెంట్ సాధించాలి. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాం. ఒకరు సాధించిన దాన్ని ఇంకొకరు దోచుకోని పరిస్థితి రావాలి” అన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన స్టార్టప్ ప్రొఫెషనల్ ఫయాజ్ మాట్లాడుతూ లెర్నింగ్ మిషన్, యువత ఆలోచనలకు రూపం ఇచ్చేందుకు క్షేత్ర స్థాయిలో కో ఆర్డినేషన్ విభాగం ఆవశ్యకతను వివరించారు. జనసేన పార్టీ భగత్ సింగ్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వెబినార్ లో ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో విద్యాభ్యాసం చేస్తున్న తెలుగు విద్యార్ధులు కలిపి సుమారు 200 మందికి పైగా పాల్గొన్నారు.
Image