వలస కూలీలకు నిత్యావసరాలు పంపిణీ, బెంగాల్ వెళ్లేందుకు అయ్యే ఖర్చును భరిస్తానని హామీ ఇచ్చిన కాంగ్రెస్ నేత.సుంకర పద్మ శ్రీ.

ఏఐసీసీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు స్పందించిన ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మ శ్రీ.


వలస కూలీలకు నిత్యావసరాలు పంపిణీ, బెంగాల్ వెళ్లేందుకు అయ్యే ఖర్చును భరిస్తానని హామీ ఇచ్చిన కాంగ్రెస్ నేత.


కృష్ణా జిల్లా , గన్నవరం మండలం , వీరపనేనిగూడెం లో వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి ఒక ప్రైవేటు  కంపెనీలో పనులు చెస్తున్న 20 మంది యువత కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల తినటానికి తిండి లేక , వారి రాష్ట్రానికి తిరిగి వెళ్ళటానికి ఇబ్భoదులు పడుతున్న విషయం తెలుసుకుని తక్షణమే వారిని వారి స్వస్థలాలకు పంపించాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారి ని పంపించేందుకు అయ్యే రవాణా ఖర్చులు తాను భరిస్తా అని స్పష్టం చేశారు. 


మద్యం అమ్మకాలు రెడ్ జోన్, ఆరంజ్ జోన్ లలో కూడా జరుపుతున్న నేపథ్యంలో వలస కూలీలను వారి స్వస్థలాలకు పంపించటానికి రాష్ట్ర ప్రభుత్వం రెడ్ జోన్, ఆరంజ్ జోన్ అని సాకులు చెప్పడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. చేతిలో ఉన్న డబ్బులు అయిపోయి, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని స్థానిక VRO దృష్టికి తీసుకెళ్లి 10 రోజులు అయినా స్పందించలేదన్నారు. ఇప్పటి వరకు వారిని ఎవరు పట్టించుకోక పోవడం దారుణం అని దుయ్యబట్టారు.  కలెక్టర్, జేసి, mro తో సహా ఎవ్వరు ఫొన్ లు ఎత్తి సమధానం చెప్పే పరిస్తితిలో లేరన్న పద్మశ్రీ... పేదలకు దిక్కు ఎవరని నిలదీశారు.


పోలీసులు, వైద్యులు, పారిశుధ్య కార్మికులు, మీడియా తమ ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తుంటే.. ఈ రాష్ట్ర  ముఖ్యమంత్రి బయటకు రాకుండా,
ఈ రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలో  ప్రణాళిక రచిస్తున్నాడని విమర్శించారు.


ఆదాయం పెంచుకునే ఆలోచన తప్ప... లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజల బాధలు చెవికి ఎక్కించుకుని స్థితిలో సీఎం లేడన్నారు. నేను ఉన్నాను... నేను విన్నాను అని ఊదరగొట్టి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దోచుకున్నాను... దాచుకున్నాను అన్న తీరుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రపంచంలో ఎక్కడా కనపడని, వినపడని బ్రాండ్లను రాష్ట్రంలోకి తీసుకువచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.


40 రోజుల లాక్డౌన్ ఫలితాన్ని ఒక్క పూటతో జగన్మోహన్ రెడ్డి.. నీరుగార్చారని.. వెంటనే మద్యం అమ్మకాలు నిలిపివేసి.. ప్రజల ప్రాణాలు కాపాడేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
19 న నెల్లూరు పోలేరమ్మ జాతర కు దేవదాయ శాఖ మంత్రి రాక
రామన్న పేటలొ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image