వలస కూలీలకు నిత్యావసరాలు పంపిణీ, బెంగాల్ వెళ్లేందుకు అయ్యే ఖర్చును భరిస్తానని హామీ ఇచ్చిన కాంగ్రెస్ నేత.సుంకర పద్మ శ్రీ.

ఏఐసీసీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు స్పందించిన ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మ శ్రీ.


వలస కూలీలకు నిత్యావసరాలు పంపిణీ, బెంగాల్ వెళ్లేందుకు అయ్యే ఖర్చును భరిస్తానని హామీ ఇచ్చిన కాంగ్రెస్ నేత.


కృష్ణా జిల్లా , గన్నవరం మండలం , వీరపనేనిగూడెం లో వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి ఒక ప్రైవేటు  కంపెనీలో పనులు చెస్తున్న 20 మంది యువత కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల తినటానికి తిండి లేక , వారి రాష్ట్రానికి తిరిగి వెళ్ళటానికి ఇబ్భoదులు పడుతున్న విషయం తెలుసుకుని తక్షణమే వారిని వారి స్వస్థలాలకు పంపించాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారి ని పంపించేందుకు అయ్యే రవాణా ఖర్చులు తాను భరిస్తా అని స్పష్టం చేశారు. 


మద్యం అమ్మకాలు రెడ్ జోన్, ఆరంజ్ జోన్ లలో కూడా జరుపుతున్న నేపథ్యంలో వలస కూలీలను వారి స్వస్థలాలకు పంపించటానికి రాష్ట్ర ప్రభుత్వం రెడ్ జోన్, ఆరంజ్ జోన్ అని సాకులు చెప్పడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. చేతిలో ఉన్న డబ్బులు అయిపోయి, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని స్థానిక VRO దృష్టికి తీసుకెళ్లి 10 రోజులు అయినా స్పందించలేదన్నారు. ఇప్పటి వరకు వారిని ఎవరు పట్టించుకోక పోవడం దారుణం అని దుయ్యబట్టారు.  కలెక్టర్, జేసి, mro తో సహా ఎవ్వరు ఫొన్ లు ఎత్తి సమధానం చెప్పే పరిస్తితిలో లేరన్న పద్మశ్రీ... పేదలకు దిక్కు ఎవరని నిలదీశారు.


పోలీసులు, వైద్యులు, పారిశుధ్య కార్మికులు, మీడియా తమ ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తుంటే.. ఈ రాష్ట్ర  ముఖ్యమంత్రి బయటకు రాకుండా,
ఈ రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలో  ప్రణాళిక రచిస్తున్నాడని విమర్శించారు.


ఆదాయం పెంచుకునే ఆలోచన తప్ప... లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజల బాధలు చెవికి ఎక్కించుకుని స్థితిలో సీఎం లేడన్నారు. నేను ఉన్నాను... నేను విన్నాను అని ఊదరగొట్టి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దోచుకున్నాను... దాచుకున్నాను అన్న తీరుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రపంచంలో ఎక్కడా కనపడని, వినపడని బ్రాండ్లను రాష్ట్రంలోకి తీసుకువచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.


40 రోజుల లాక్డౌన్ ఫలితాన్ని ఒక్క పూటతో జగన్మోహన్ రెడ్డి.. నీరుగార్చారని.. వెంటనే మద్యం అమ్మకాలు నిలిపివేసి.. ప్రజల ప్రాణాలు కాపాడేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
కరోనా నియంత్రణలో విజయవాడ నగరాన్ని రాష్టానికే  ఆదర్శంగా ఉండేలా చేయాలి: సిఎస్ నీలం సాహ్ని
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image