విపత్కర పరిస్థితుల్లో చేతనైనంత సేవ చేయడం మా బాధ్యత: వైసీపీ నాయకులు..  

విపత్కర పరిస్థితుల్లో చేతనైనంత సేవ చేయడం మా బాధ్యత: వైసీపీ నాయకులు..


గూడూరు: గౌరవ శాసనసభ్యులు డా. వెలగపల్లి వరప్రసాద్ రావు గారు, వై సి పి రాష్ట్ర నాయకులు శ్రీ ఎల్లసిరి గోపాల్ రెడ్డి గారి సహాయ సహకారాలతో,  కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో మార్చి 29 వ తేదీ నుండి నేటి వరకు 36 రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా, నిర్ణీత సమయానికి 350 మందికి (పారిశుధ్య సిబ్బందికి మరియు బయట ఊర్లనుండి విధినిర్వహణలో పాల్గొంటున్న కొంతమంది ప్రభుత్వ సిబ్బందికి ) టిఫిన్ అందచేయటం జరిగింది అని వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి నాసిన నాగులు అన్నారు. ఈ సందర్భంగా నాగులు మాట్లాడుతూ  పెద్దలు ఎల్లసిరి గోపాల్ రెడ్డి గారు,నేను మరియు మిత్రులు మాజీ కౌన్సిలర్లు బొమిడి శ్రీనివాసులు, చోళవరం గిరిబాబుల సంపూర్ణ సహాయ సహకారాలు, గౌరవ కమీషనరు గారు, గౌరవ పోలీస్ అధికారుల సూచనల ప్రకారం, సచివాలయ సిబ్బంది ద్వారా  ఈ కార్యక్రమాన్ని నేటి వరకు నిర్విఘ్నంగా కొనసాగించి నేటితో ముగిస్తున్నాము అని ఈ సందర్భంగా గూడూరు మునిసిపల్ కార్యాలయం నందు ఎమ్మెల్యే వరప్రసాద్ రావు గారి చేతుల మీదుగా 310 మందికి అల్పాహారం ప్యాకెట్ లను మునిసిపల్ మరియు పారిశుద్ధ్య సిబ్బందికి అందజేయడం జరిగింది.లాక్ డౌన్ సమయంలో మా ఈ చిన్న కార్యక్రమానికి అనుమతించి, మమ్మల్ని కూడా భాగస్వాములను చేసిన గౌరవ మున్సిపల్ కమీషనరు గారికి, పోలీస్ అధికారులకు, మీడియా మిత్రులకు,  సచివాలయ సానిటరీ సిబ్బందికి,  వాలంటీర్లందరికీ, సహకరించిన మా మిత్రులు, కుటుంభ సభ్యులందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ ఓబులేశు, పట్టణ సీఐ దశరథ రామారావు, వైసీపీ నాయకులు అన్నం మురళి,మైనారిటీ నాయకులు సందాని బాషా తదితరులు పాల్గొన్నారు.