జె.వి.వి. ఆద్వర్యంలొ మల్లికార్జున్ (వి.కె.షోరూం) దాతృత్వంలొ గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రినందు ఆహారం పంపిణీ

గూడూరు మే 9 (అంతిమ తీర్పు,) :     జె.వి.వి. ఆద్వర్యంలొ మల్లికార్జున్ (వి.కె.షోరూం) దాతృత్వంలొ గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రినందు 60మంది గర్భిణి స్త్రీలకు భోజనాలు (వెజిటబుల్ రైస్, గ్రుడ్డు, అరటిపండు) డాక్టర్ ఉమా చేతులమీదుగా పంపిణి చేయడమైనది. డాక్టర్ ఉమా మాట్లాడుతు కరోన సమయంలొకూడా జె.వి.వి.వారు మా ఆసుపత్రికి వచ్చే నిరుపేదలైన గర్భిణి స్త్రీలకు భోజనాలు పంపిణి చేయడం చాలా ఆనందంగ ఉందని దాతగ వ్యవహరించిన వి.కె.షోరూం అధినేత మల్లికార్జున కృతజ్ఞతలు తెలిపారు.. ఈ కార్యక్రమంలొ వేగూరు రాజేంద్రప్రసాద్, అశోక్, విష్ణు, రుదీప్, మనోహర్, చంద్ర, శ్రీనివాస్ డాక్టర్ సుబ్రహ్మణ్యంగారు తదితరులు పాల్గొన్నారు.