. జర్నలిస్టులకు 50 లక్షల కరోనా ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలి సమాచార కమిషనర్ కు ఏ.పీ. జే .ఎఫ్ .నేతల విజ్ఞప్తి విజయవాడ జూన్ 22: రాష్ట్రంలోని విలేకరులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఉదయం పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ప్రాంగణంలోని ఐ అండ్ పీఆర్ కమిషనర్ కార్యాలయంలో విజయ్ కుమార్ రెడ్డిని ఏ.పీ. జే. ఎఫ్. రాష్ట్ర నాయకులు కలిశారు. ముఖ్యంగా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కోవిడ్ 19 వైరస్ ప్రభావానికి గురైన విలేకరులకు రూ 50 లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని కల్పించాలని, వైద్యులు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు లాగానే విలేకరులు కూడా నిరంతరం వార్తా సేకరణలో భాగంగా కష్టాలు పడుతున్నారన్నారు. ఏదైనా అవాంఛనీయ సంఘటనల వల్ల కరోనా మహమ్మారి బారిన పడి మీడియా ప్రతినిధి మృతి చెందితే విలేఖర్లకు రూ 50 లక్షల రూపాయల బీమా సౌకర్యం వర్తించేలా గా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని నాయకులు విజయ్ కుమార్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. అలాగే ఎంతో కాలంగా విలేకరులుఎదురు చూస్తున్న అక్రిడిటేషన్ కార్డులు త్వరితగతిన ఇవ్వాలని ఆయన ను కోరారు. అయితే అక్కడ అక్రిడేషన్ ప్రక్రియ జరుగుతుందని, జూలై నెల ఆరంభంలోకొత్త కార్డులు ఇచ్చేందుకే ప్రయత్నం చేస్తున్నట్లు కమిషనర్ స్పష్టం చేశారు. అలాగే విలేకరుల హెల్త్ కార్డ్ విషయంలో కూడా సకాలంలో చర్యలు తీసుకోవాలని యూనియన్ నాయకులు కోరగా కొత్త అక్రిడేషన్ వచ్చే వరకు పాత కార్డులు పనిచేసే విధంగా ఆరోగ్య శ్రీ అధికారుల దృష్టికి తీసుకెళ్లమని, కార్డ్ ఉన్న జర్నలిస్టు లకు ఏమైనా ఇబ్బంది వస్తే తమ కార్యాలయంలోని ఏ.డి.గారిని కలిస్తే హెల్త్ కార్డ్ ఆ సమస్య పరిష్కారిస్తారన్నారు. ప్రమాద బీమా పునరుద్ధరించాలని కోరగా, అది ప్రభుత్వం వద్ద ఉందన్నారు. జర్నలిస్ట్ లు ఈ కరోన సమయంలో మరింత ఇబ్బంది పడకుండా అక్రిడేషన్ తదితర సమస్యలు పరిష్కాoరిచాలని నేతలు కోరారు. ఏపీజే ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణాoజనేయులు నేతృత్వంలో, రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నవరపు బ్రహ్మయ్య, రాష్ట్ర కార్యదర్శి వీర్ల శ్రీరామ్ యాదవ్, విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి యేమినేని వెంకటరమణ , నగర కోశాధికారి అనిల్ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డికి జర్నలిస్టుల సమస్యలను తెలియజేశారు. ప్రతి సమస్యను పరిష్కరిస్తానని,వర్కింగ్ జర్నలిస్ట్ లకు ప్రభుత్వం న్యాయం చేస్తుoదని,వారు సానుకూలంగా స్పందించినందుకు కమీషనర్ కు ఏపీ జే ఎఫ్ కృతజ్ఞతలు తెలియజేశారు.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
జర్నలిస్ట్ మిత్రులకు మేడే శుభాకాంక్షలు.: మాణిక్యరావు కె. రాష్ట్ర ఉపాధ్యక్షులు.. APUWJ...
Image