. జర్నలిస్టులకు 50 లక్షల కరోనా ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలి సమాచార కమిషనర్ కు ఏ.పీ. జే .ఎఫ్ .నేతల విజ్ఞప్తి విజయవాడ జూన్ 22: రాష్ట్రంలోని విలేకరులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఉదయం పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ప్రాంగణంలోని ఐ అండ్ పీఆర్ కమిషనర్ కార్యాలయంలో విజయ్ కుమార్ రెడ్డిని ఏ.పీ. జే. ఎఫ్. రాష్ట్ర నాయకులు కలిశారు. ముఖ్యంగా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కోవిడ్ 19 వైరస్ ప్రభావానికి గురైన విలేకరులకు రూ 50 లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని కల్పించాలని, వైద్యులు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు లాగానే విలేకరులు కూడా నిరంతరం వార్తా సేకరణలో భాగంగా కష్టాలు పడుతున్నారన్నారు. ఏదైనా అవాంఛనీయ సంఘటనల వల్ల కరోనా మహమ్మారి బారిన పడి మీడియా ప్రతినిధి మృతి చెందితే విలేఖర్లకు రూ 50 లక్షల రూపాయల బీమా సౌకర్యం వర్తించేలా గా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని నాయకులు విజయ్ కుమార్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. అలాగే ఎంతో కాలంగా విలేకరులుఎదురు చూస్తున్న అక్రిడిటేషన్ కార్డులు త్వరితగతిన ఇవ్వాలని ఆయన ను కోరారు. అయితే అక్కడ అక్రిడేషన్ ప్రక్రియ జరుగుతుందని, జూలై నెల ఆరంభంలోకొత్త కార్డులు ఇచ్చేందుకే ప్రయత్నం చేస్తున్నట్లు కమిషనర్ స్పష్టం చేశారు. అలాగే విలేకరుల హెల్త్ కార్డ్ విషయంలో కూడా సకాలంలో చర్యలు తీసుకోవాలని యూనియన్ నాయకులు కోరగా కొత్త అక్రిడేషన్ వచ్చే వరకు పాత కార్డులు పనిచేసే విధంగా ఆరోగ్య శ్రీ అధికారుల దృష్టికి తీసుకెళ్లమని, కార్డ్ ఉన్న జర్నలిస్టు లకు ఏమైనా ఇబ్బంది వస్తే తమ కార్యాలయంలోని ఏ.డి.గారిని కలిస్తే హెల్త్ కార్డ్ ఆ సమస్య పరిష్కారిస్తారన్నారు. ప్రమాద బీమా పునరుద్ధరించాలని కోరగా, అది ప్రభుత్వం వద్ద ఉందన్నారు. జర్నలిస్ట్ లు ఈ కరోన సమయంలో మరింత ఇబ్బంది పడకుండా అక్రిడేషన్ తదితర సమస్యలు పరిష్కాoరిచాలని నేతలు కోరారు. ఏపీజే ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణాoజనేయులు నేతృత్వంలో, రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నవరపు బ్రహ్మయ్య, రాష్ట్ర కార్యదర్శి వీర్ల శ్రీరామ్ యాదవ్, విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి యేమినేని వెంకటరమణ , నగర కోశాధికారి అనిల్ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డికి జర్నలిస్టుల సమస్యలను తెలియజేశారు. ప్రతి సమస్యను పరిష్కరిస్తానని,వర్కింగ్ జర్నలిస్ట్ లకు ప్రభుత్వం న్యాయం చేస్తుoదని,వారు సానుకూలంగా స్పందించినందుకు కమీషనర్ కు ఏపీ జే ఎఫ్ కృతజ్ఞతలు తెలియజేశారు.
Popular posts
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
• Valluru Prasad Kumar
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
• Valluru Prasad Kumar
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
• Valluru Prasad Kumar
సిమెంట్ ధరల వ్యత్యాసం నియంత్రణ కు "వైయస్ఆర్ నిర్మాణ్” ప్రారంభం
• Valluru Prasad Kumar
అన్నింటికీ అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు.
• Valluru Prasad Kumar
Publisher Information
Contact
anthimateerpudaily@gmail.com
9704871289
H No. 11-24-4, Vinnakota vaari chowk, Bhavanarayana vaari st.
Vijayawada - 520001. Andhra Pradesh.
About
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn