. జర్నలిస్టులకు 50 లక్షల కరోనా ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలి సమాచార కమిషనర్ కు ఏ.పీ. జే .ఎఫ్ .నేతల విజ్ఞప్తి విజయవాడ జూన్ 22: రాష్ట్రంలోని విలేకరులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఉదయం పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ప్రాంగణంలోని ఐ అండ్ పీఆర్ కమిషనర్ కార్యాలయంలో విజయ్ కుమార్ రెడ్డిని ఏ.పీ. జే. ఎఫ్. రాష్ట్ర నాయకులు కలిశారు. ముఖ్యంగా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కోవిడ్ 19 వైరస్ ప్రభావానికి గురైన విలేకరులకు రూ 50 లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని కల్పించాలని, వైద్యులు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు లాగానే విలేకరులు కూడా నిరంతరం వార్తా సేకరణలో భాగంగా కష్టాలు పడుతున్నారన్నారు. ఏదైనా అవాంఛనీయ సంఘటనల వల్ల కరోనా మహమ్మారి బారిన పడి మీడియా ప్రతినిధి మృతి చెందితే విలేఖర్లకు రూ 50 లక్షల రూపాయల బీమా సౌకర్యం వర్తించేలా గా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని నాయకులు విజయ్ కుమార్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. అలాగే ఎంతో కాలంగా విలేకరులుఎదురు చూస్తున్న అక్రిడిటేషన్ కార్డులు త్వరితగతిన ఇవ్వాలని ఆయన ను కోరారు. అయితే అక్కడ అక్రిడేషన్ ప్రక్రియ జరుగుతుందని, జూలై నెల ఆరంభంలోకొత్త కార్డులు ఇచ్చేందుకే ప్రయత్నం చేస్తున్నట్లు కమిషనర్ స్పష్టం చేశారు. అలాగే విలేకరుల హెల్త్ కార్డ్ విషయంలో కూడా సకాలంలో చర్యలు తీసుకోవాలని యూనియన్ నాయకులు కోరగా కొత్త అక్రిడేషన్ వచ్చే వరకు పాత కార్డులు పనిచేసే విధంగా ఆరోగ్య శ్రీ అధికారుల దృష్టికి తీసుకెళ్లమని, కార్డ్ ఉన్న జర్నలిస్టు లకు ఏమైనా ఇబ్బంది వస్తే తమ కార్యాలయంలోని ఏ.డి.గారిని కలిస్తే హెల్త్ కార్డ్ ఆ సమస్య పరిష్కారిస్తారన్నారు. ప్రమాద బీమా పునరుద్ధరించాలని కోరగా, అది ప్రభుత్వం వద్ద ఉందన్నారు. జర్నలిస్ట్ లు ఈ కరోన సమయంలో మరింత ఇబ్బంది పడకుండా అక్రిడేషన్ తదితర సమస్యలు పరిష్కాoరిచాలని నేతలు కోరారు. ఏపీజే ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణాoజనేయులు నేతృత్వంలో, రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నవరపు బ్రహ్మయ్య, రాష్ట్ర కార్యదర్శి వీర్ల శ్రీరామ్ యాదవ్, విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి యేమినేని వెంకటరమణ , నగర కోశాధికారి అనిల్ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డికి జర్నలిస్టుల సమస్యలను తెలియజేశారు. ప్రతి సమస్యను పరిష్కరిస్తానని,వర్కింగ్ జర్నలిస్ట్ లకు ప్రభుత్వం న్యాయం చేస్తుoదని,వారు సానుకూలంగా స్పందించినందుకు కమీషనర్ కు ఏపీ జే ఎఫ్ కృతజ్ఞతలు తెలియజేశారు.
Popular posts
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద ఖరీఫ్ విత్తనాల పంపిణీ
• Valluru Prasad Kumar
ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ నేడు 172 వ జయంతి.
• Valluru Prasad Kumar
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
• Valluru Prasad Kumar
జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధికి సహకరించండి.. * కమిషనర్ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్రతినిధులు నెల్లూరు: పాత్రికేయులకు నెల్లూరులో ప్రభుత్వం కేటాయించిన జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధికి సహకరించాలని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అడహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్కుమార్ బుధవారం మున్సిపల్ కమిషనర్ కె.దినేష్కుమార్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్లోని టౌన్ ప్లానింగ్ విభాగం తరఫున అభివృద్ధి చేయాలని కోరారు. జర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
• Valluru Prasad Kumar
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
• Valluru Prasad Kumar
Publisher Information
Contact
anthimateerpudaily@gmail.com
9704871289
H No. 11-24-4, Vinnakota vaari chowk, Bhavanarayana vaari st.
Vijayawada - 520001. Andhra Pradesh.
About
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn