ల‌య‌న్స్ క్ల‌బ్ సేవ‌లు అజ‌రామ‌రం... * కృష్ణా క‌లెక్ట‌ర్ ఏ.యండి.ఇంతియాజ్ విజ‌య‌వాడ‌‌: సామాజి క బాధ్య‌త‌గా ఇప్ప‌టివ‌ర‌‌కు విద్య, వైద్యం వంటి విష‌యాల్లో విశేష సేవ‌లందిస్తోన్న ల‌య‌న్స్ క్ల‌బ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫౌండేష‌న్ (ఎల్‌.సి.ఐ.ఎఫ్‌) మునుపెన్న‌డూ చూడ‌ని క‌రోనా వైర‌స్ వంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లోనూ సేవ‌లందించేందుకు ముందుకు రావ‌డం ముదావ‌హ‌మ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఏయండి ఇంతియాజ్ అన్నారు. ల‌య‌న్స్ క్ల‌బ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డి కోసం రూ.7.50ల‌క్ష‌లు విలువైన పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్క్‌లు, శానిటైజ‌ర్లును న‌గ‌రంలోని క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యంలో క‌లెక్ట‌ర్ ఇంతియాజ్‌కు ‌గురువారం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా క‌‌లెక్ట‌ర్ ఇంతియాజ్ మాట్లాడుతూ జిల్లాలో రోజురోజుకూ విస్త‌రిస్తోన్న క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డి కోసం ల‌య‌న్స్ క్ల‌బ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫౌండేష‌న్ మాన‌వ‌తా దృక్ప‌దంతో ముందుకు వ‌చ్చి జిల్లాలోని కోవిడ్ ఆసుప‌త్రులు, అర్బ‌న్ హెల్త్ సెంట‌ర్లలో క‌రోనా వ్యాప్తి బారిన ప‌డ్డవారికి చికిత్స అంద‌జేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్క్‌లు, శానిటైజ‌ర్లు అంద‌జేయ‌డం ప్ర‌శంస‌నీయ‌మ‌న్నారు. ఇప్ప‌టికే ల‌య‌న్స్ క్ల‌బ్ ఇంట‌ర్నేష‌నల్ సంస్థ సామాజిక బాధ్య‌త‌గా ఎన్నో సేవ‌ల‌ను అందించింద‌ని కొనియాడారు. ల‌య‌న్స్ జిల్లా గ‌వ‌ర్న‌ర్ వైపీసీ ప్ర‌సాద్ (జిల్లా 316-డి) మాట్లాడుతూ జిల్లా క‌లెక్ట‌ర్‌కు అందజేయ‌గా మిగిలిన పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్క్‌లు, శానిటైజ‌ర్లును అన్ని ల‌య‌న్స్ క్ల‌బ్స్ ద్వారా జిల్లా వ్యాప్తంగా ఫ‌స్ట్ ఎయిడ్ సెంట‌ర్లు, అర్బ‌న్ హెల్త్ సెంట‌ర్లలో పంపిణీ చేయ‌‌నున్న‌ట్లు తెలిపారు. కార్య‌క్ర‌మంలో పీఐడి ల‌య‌న్ చిగురుపాటి వ‌ర‌ప్ర‌సాద్‌,ఫ‌స్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గ‌వ‌ర్న‌ర్ డాక్ట‌ర్ పుట్ట‌గుంట వెంక‌ట స‌తీష్‌కుమార్‌, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గ‌వ‌ర్న‌ర్ దేవినేని జోనీకుమారి, ప‌లువురు ల‌య‌న్స్ ప్ర‌తినిధులు పాల్గొన్నారు.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
19 న నెల్లూరు పోలేరమ్మ జాతర కు దేవదాయ శాఖ మంత్రి రాక
రామన్న పేటలొ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image