*సీతారామపురం పి.హెచ్.సిలో 57 ర్యాపిడ్ పరీక్షలు* డాక్టర్ అనిష్ సల్మా.... ఉదయగిరి, సెప్టెంబర్ 21 (అంతిమ తీర్పు- ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ఉదయగిరి నియోజకవర్గంలోని సీతారామపురం ప్రాధమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో సోమవారం నాడు కరోనా వైరస్ నియంత్రణా చర్యలలో భాగంగా 57 మందికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించినట్లు సంజీవిని బస్ ఇంచార్జ్, ఉదయగిరి సి.హెచ్.సి డెంటల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ అనిష్ సల్మా పేర్కొన్నారు. ఇప్పటికే సంజీవిని బస్ ద్వారా ఆత్మకూరు డివిజన్ పరిధిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు షెడ్యూల్ ప్రకారం కరోనా వైరస్ అధిక ప్రభావిత ప్రాంతాలలో ప్రజలకు టెస్టులు చేస్తున్నామన్నారు. సీతారామపురంలో నిర్వహించిన ర్యాపిడ్ టెస్టులలో 7 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం జరిగిందన్నారు. వారందరికీ కూడా తగు సూచనలు, సలహాలు ఇచ్చి క్వారంటైన్ నందు ఉండాలని ఆదేశించామన్నారు. కరోనా వైరస్ విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించరాదన్నారు. తీవ్ర జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే స్థానికంగా ఉన్న వైద్యులను సంప్రదించి ఈ వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాల్సిన ఆవశ్యకత ప్రస్తుత పరిస్థితులలో ఎంతైనా ఉందని డాక్టర్ అనిష్ సల్మా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు గానూ ఎప్పటికప్పుడు ప్రభుత్వ సూచనలను, అధికారుల సలహాలను తప్పకుండా పాటించే విధంగా అందరూ చైతన్యం కలిగి ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ ర్యాపిడ్ పరీక్షలలో ఉదయగిరి సి.హెచ్.సి ల్యాబ్ టెక్నీషియన్ సాయినాధ్, ఏ.యన్.యం లు ఉన్నారు.
Popular posts
*వింజమూరు ప్రజలు జాగ్రత్తలు వహించండి* డాక్టర్ రమేష్.... వింజమూరు, సెప్టెంబర్ 22 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలోని ప్రజలు కరోనా వైరస్ మహమ్మారి పట్ల తగు జాగ్రత్తలు వహించాలని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైధ్యాధికారి డాక్టర్ రమేష్ కోరారు. ఇప్పటివరకు మండలంలో 500లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగిందన్నారు. అయితే అదే స్థాయిలో బాధితులు కోలుకుంటుండటం సంతోషకరమైన విషయమన్నారు. కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఈ వైరస్ పట్ల అవగాహనా రాహిత్యం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం శ్రేయస్కరం కాదన్నారు. కరోనా నుండి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖలు ఎంతగానో కృషి చేస్తున్నాయన్నారు. అయితే ప్రభుత్వ సూచనలను పెడచెవిన పెట్టడం వలన వైరస్ ప్రబలేందుకు పరోక్షంగా దోహదపడుతున్నామన్నారు. కనీస జాగ్రత్తలు పాటించిన పక్షంలో కరోనాను అంతమొందించడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. ప్రతి నిత్యం వేడి వేడి ఆహార పదార్ధాలను భుజించడం, దాహం వేసినప్పుడు గోరువెచ్చని నీటిని సేవించడం, యోగా, ముఖానికి మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి సూచనలను ప్రతి ఒక్కరూ విధిగా అలవాటు చేసుకోవాలన్నారు. వైరస్ సోకిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రమేష్ తెలిపారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు.
• Valluru Prasad Kumar
ఆ నేరస్తుడిని కఠినంగా శిక్షించాలి : సీఎం జగన్
• Valluru Prasad Kumar
16 న చిన్న, మధ్యతరహా పత్రికల రాష్ట్ర మహాసభ : మల్లెల
• Valluru Prasad Kumar
చెన్నకేశవ స్వామి ఆలయ ఈవో నారాయణ రెడ్డి మృతి పట్ల మంత్రి సంతాపం
• Valluru Prasad Kumar
కరోనా నియంత్రణకు దక్కన్ టూబాకో కంపెనీ గ్రూప్
• Valluru Prasad Kumar
Publisher Information
Contact
anthimateerpudaily@gmail.com
9704871289
H No. 11-24-4, Vinnakota vaari chowk, Bhavanarayana vaari st.
Vijayawada - 520001. Andhra Pradesh.
About
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn