ఏపిపిటిడిఏఈఏ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ప్లానింగ్ అడ్వైజ‌ర్‌గా శంక‌ర్‌ విజ‌య‌వాడ‌‌: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ అభ్యుదయ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏపిపిటిడిఏఈఏ) రాష్ట్ర కమిటీలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్లానింగ్ అడ్వైజర్‌గా కొంకిమ‌ళ్ల శంక‌ర్‌ను నియమించిన‌ట్లు అసోసియేష‌న్ ‌రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కా సాయిబాబు శుక్ర‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఈ మేర‌కు నియామకపు పత్రాన్నివిజ‌య‌వాడ ఆర్టీసీ హౌస్‌లోని ప్ర‌ధాన కార్యాల‌యంలో ఉంటున్న ఏపి ప‌బ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ క‌మిష‌న‌ర్ టి.కృష్ణ‌బాబుకు పంపించారు. సుమారు గ‌డ‌చిన రెండు ద‌శాబ్ధాలుగా శంక‌ర్ జర్నలిజంలో అపారమైన అనుభవంతో పాటు సామాజిక బాధ్య‌త‌గా త‌నవంతుగా ప‌లు సేవా కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటూ సేవలందిస్తున్నార‌ని జ‌‌క్కా సాయిబాబు పేర్కొన్నారు. ఈ నేప‌ధ్యంలో శంక‌ర్ అభ్యుదయ ఎంప్లాయిస్ అసోసియేషన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు బాసటగా నిలిచేందుకు ముందుకు రావడం అభినంద‌నీయ‌మ‌న్నారు. ఏపిపిటిడిఏఈఏ రాష్ట్ర ప్ర‌చార కార్య‌ద‌ర్శి పి.సుబ్ర‌హ్మ‌ణ్యం మాట్లాడుతూ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ పట్ల పూర్తి అవగాహన ఉన్న శంక‌ర్‌ను రాష్ట్ర కమిటీ త‌ర‌ఫున అభినందిస్తున్న‌ట్లు తెలిపారు.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
మెట్టలో బత్తాయి రైతులకు పుట్టెడు కష్టాలు..*.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
శ్రీ‌వారి ఆల‌య మాడ వీధుల్లో శ్రీ ఉగ్ర‌శ్రీ‌నివాస‌మూర్తి ద‌ర్శ‌నం
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు