ఏపిపిటిడిఏఈఏ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ప్లానింగ్ అడ్వైజ‌ర్‌గా శంక‌ర్‌ విజ‌య‌వాడ‌‌: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ అభ్యుదయ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏపిపిటిడిఏఈఏ) రాష్ట్ర కమిటీలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్లానింగ్ అడ్వైజర్‌గా కొంకిమ‌ళ్ల శంక‌ర్‌ను నియమించిన‌ట్లు అసోసియేష‌న్ ‌రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కా సాయిబాబు శుక్ర‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఈ మేర‌కు నియామకపు పత్రాన్నివిజ‌య‌వాడ ఆర్టీసీ హౌస్‌లోని ప్ర‌ధాన కార్యాల‌యంలో ఉంటున్న ఏపి ప‌బ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ క‌మిష‌న‌ర్ టి.కృష్ణ‌బాబుకు పంపించారు. సుమారు గ‌డ‌చిన రెండు ద‌శాబ్ధాలుగా శంక‌ర్ జర్నలిజంలో అపారమైన అనుభవంతో పాటు సామాజిక బాధ్య‌త‌గా త‌నవంతుగా ప‌లు సేవా కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటూ సేవలందిస్తున్నార‌ని జ‌‌క్కా సాయిబాబు పేర్కొన్నారు. ఈ నేప‌ధ్యంలో శంక‌ర్ అభ్యుదయ ఎంప్లాయిస్ అసోసియేషన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు బాసటగా నిలిచేందుకు ముందుకు రావడం అభినంద‌నీయ‌మ‌న్నారు. ఏపిపిటిడిఏఈఏ రాష్ట్ర ప్ర‌చార కార్య‌ద‌ర్శి పి.సుబ్ర‌హ్మ‌ణ్యం మాట్లాడుతూ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ పట్ల పూర్తి అవగాహన ఉన్న శంక‌ర్‌ను రాష్ట్ర కమిటీ త‌ర‌ఫున అభినందిస్తున్న‌ట్లు తెలిపారు.


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాను కలిసి ఫిర్యాదు చేసిన వైయస్ఆర్ కాంగ్రెెస్ పార్లమెంటరీ పార్టీ నేత శ్రీ వి. విజయసాయిరెడ్డి, లోక్ సభాపక్ష నేత శ్రీ మిథున్ రెడ్డి, ఎంపీలు శ్రీ నందిగం సురేష్, శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు, శ్రీ మార్గాని భరత్..
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
అఖిల భారత వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కాల్ సెంటర్ నంబర్లు 18001804200 మరియు 14488
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image